Most Wanted Criminal : హత్యలు..కిడ్నాప్‌లకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్ అరెస్ట్

ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత కొన్నేళ్లుగా కిడ్నాప్‌లు, బెదిరింపులు, హత్యలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్‌ను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

Most Wanted Criminal : హత్యలు..కిడ్నాప్‌లకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్ అరెస్ట్

Sunkara Prasad Naidu

Most Wanted Criminal :  ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత కొన్నేళ్లుగా కిడ్నాప్‌లు, బెదిరింపులు, హత్యలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్‌ను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు   నాయకత్వం   వహిస్తున్న సుంకర ప్రసాద్ నాయుడుతో సహా 13 మందిని గుంతకల్లు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక పిస్తోల్, 16 తుటాలు, స్కార్పియో, ఇటియాస్, బుల్లెట్ వాహనాలతో పాటు రూ. 6.50 లక్షల నగదు స్వాధీనం  చేసుకున్నట్లు  జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి చెప్పారు.

గుంతకల్లు మండలం జి.కొట్టాలకు చెందిన కోనంకి వెంకటేష్‌ అనే ఆకుల వ్యాపారిని   డబ్బు కోసం ఈనెల 20 వ తేదీన ముఠా కిడ్నాప్ చేసింది.  కిడ్నాప్ చేసి డోన్ సమీపంలోని ఓబుళాపురం మిట్టపై  దాచి కోటి రూపాయిలు డబ్బు తీసుకురావాలని… లేదంటే చంపుతామని బాధిత కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు.  వారు  పోలీసులకు ఫిర్యాదు చేయటంతో గుంతకల్లు డీఎస్పీ నరసింగప్ప, గుంతకల్లు రూరల్ సి.ఐ లక్ష్మణ్ ల ఆధ్వర్యంలో  జిల్లా ఎస్పీ టీం ను ఏర్పాటు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న   పోలీసులు  పక్కా సమాచారంతో  డోన్ సమీపంలోని ఓబుళాపురంపై మిట్టపై కిడ్నాపర్ల ముఠాను అరెస్టు చేసి బాధితునికి విముక్తి కల్పించారు.

ఈ ముఠా గత నెల 29 న స్వామీజీ ముత్యాల గంగరాజును కిడ్నాప్ చేసి రూ. 24 లక్షలు డిమాండ్ చేసి వసూలు చేసారని జిల్లా ఎస్పీ వివరించారు. రెండు దశాబ్దాలకు పైగా నేర చరిత ఉన్న సుంకర ప్రసాద్ నాయుడిపై రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు 11 కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటిలో హత్యలు, కిడ్నాప్ లు, బలవంతపు వసూళ్లు, దొంగతనం కేసులు ఉన్నాయని, గుంతకల్లు మండలం జి.కొట్టాలకు చెందిన మోహన్ నాయుడు అనే వ్యక్తి.. సుంకర ప్రసాద్ నాయుడు   యూట్యూబ్ ఇంటర్వూలతో ఆకర్షణకు గురయ్యాడన్నారు. అతనిని సంప్రదించి  మిగతా వారిని కలుపుకుని ముఠా నేరాల్లో పాలు పంచుకున్నారని చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో హత్యలు, కిడ్నాపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడిన సుంకర ప్రసాద్ నాయుడి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న గుంతకల్లు డీఎస్పీ బృందాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి అభినందించారు. సుంకర ప్రసాద్ నాయుడు ప్రస్తుతం హైదరాబాద్ చర్లపల్లిలో నివాసం ఉంటున్నాడని….. అతని ముఠా చేతుల్లో ఈ తరహా ఇబ్బంది పడిన వారు ఎవరైనా ఉంటే అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ని  సంప్రదించాలన్నారు.

Also Read : Tamilnadu : హెడ్మాస్టర్ పాడుబుద్ధి… మాట్లాడాలని గదిలోకి పిలిచి ..