Nara Lokesh Alcohol Deaths : సారా మ‌ర‌ణాల‌న్నీ జ‌గ‌న్ స‌ర్కార్ హ‌త్య‌లే-నారా లోకేష్

సారా మ‌ర‌ణాల‌న్నీ జ‌గ‌న్ స‌ర్కార్ హ‌త్య‌లే అని లోకేష్(Nara Lokesh Alcohol Deaths) ఆరోపించారు. జంగారెడ్డిగూడెం మ‌ర‌ణాల‌పై న్యాయ‌ విచార‌ణ..

Nara Lokesh Alcohol Deaths : సారా మ‌ర‌ణాల‌న్నీ జ‌గ‌న్ స‌ర్కార్ హ‌త్య‌లే-నారా లోకేష్

Nara Lokesh

Nara Lokesh Alcohol Deaths : ఏపీలో సారా మరణాలు కలకలం రేపుతున్నాయి. రాజకీయాల్లో హీట్ పెంచాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణం అయ్యాయి. సారా మరణాల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. సారా మ‌ర‌ణాల‌న్నీ జ‌గ‌న్ స‌ర్కార్ హ‌త్య‌లే అని ఆయన ఆరోపించారు.(Nara Lokesh Alcohol Deaths)

జ‌గ‌న్.. సొంత చౌక మ‌ద్యం అధిక ధ‌ర‌ల‌కి విక్రయిస్తున్నారని, ఆ మ‌ద్యం కొన‌లేక సారా తాగి 15 మంది బలయ్యారని లోకేష్ ఆరోపణలు చేశారు. ఎక్సైజ్‌, ఎస్ఈబీ, జ‌గ‌న్ అధికార యంత్రాంగం ఏం చేస్తోందని లోకేష్ ప్రశ్నించారు. మ‌ర‌ణాల‌పై ప్ర‌భుత్వం, సంబ‌ధిత శాఖ స్పందించ‌క‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోందన్నారు. జంగారెడ్డిగూడెం సారా మ‌ర‌ణాల‌పై న్యాయ‌ విచార‌ణ జ‌రిపించాలని లోకేష్ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.(Nara Lokesh Alcohol Deaths)

ఏపీలో మిస్టరీ మరణాలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా 15మంది హఠాత్తుగా చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. చిన్నపాటి నలతగా అనిపించడం, ఆస్పత్రికి వెళ్లిన గంటల్లోనే చనిపోవడం.. వంటి ఘటనలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో రెండు రోజుల వ్యవధిలో 15 మంది మృతి చెందారు. వీరిలో పది మందికి పైగా 40- నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న వారే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నవారు ఉన్నట్లుండి అస్వస్థతకు గరికావడం సమస్య ఏంటో గుర్తించేలోపే ప్రాణాలు కోల్పోవడం జరగుతోంది. దీంతో వారి కుటుంబాలు తీరని విషాదంలో మునిగిపోతున్నాయి.

Chandrababu On Mystery Deaths : ప్రాణాలు పోతున్నా స్పందించరా? ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం

మృతులంతా కూలిపనులు, చిన్నచిన్న వృత్తులు చేసుకునే వారే. అస్వస్థతకు గురిన వెంటనే ఆర్ఎంపీలు, స్థానిక డాక్టర్ల దగ్గర ట్రీట్ మెంట్ తీసుకున్న అనంతరం.. పెద్దాస్పత్రులకు వెళ్లిన కొద్దిసేపటికే మృతి చెందారు. ఎక్కువ మంది వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలతోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ మిస్టరీ మరణాల వెనుక కారణాలేంటన్నది ఎవరికీ తెలియడం లేదు. అయితే కల్తీసారా కారణంగా వీరంతా మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. మృతుల్లో చాలామంది రోజువారి కూలి పనులు చేసుకునేవారే.

ఈ మిస్టరీ మరణాలకు నాటుసారానే కారణమని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో నాసిరకం మద్యం విక్రయిస్తూ, మరోవైపు గ్రామాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు నాటు సారా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు మద్యపాన నిషేధం అమలు చేసి ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవా? ఇంతమంది మహిళల మంగళ సూత్రాలు తెగేవా? ‎అని ప్రశ్నించారు.