ఏపీలో కొత్తగా 402 కరోనా కేసులు, కోలుకున్నది 412 మంది
Newly registered 402 corona cases in AP : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 402 కేసులు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 56, 425 శాంపిల్స్ ను పరీక్షించగా 402 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 8,79,339కు చేరింది.
24 గంటల్లో కొత్తగా నలుగురు కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 7,082 కి చేరింది. ఈ మేరకు మంగళవారం (డిసెంబర్ 22, 2020) రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో 412 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,978 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి.