Kodali Nani : ఎన్టీఆర్ అసలైన వారసులు వస్తారు, తండ్రీ కొడుకులను తరిమేస్తారు- చంద్రబాబు, లోకేశ్లపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
లోకేశ్ రెడ్ బుక్ చూసి ఎవడు భయపడతాడు? తండ్రీ కొడుకులు నన్ను ఏమీ..Kodali Nani - Nara Lokesh
![Kodali Nani : ఎన్టీఆర్ అసలైన వారసులు వస్తారు, తండ్రీ కొడుకులను తరిమేస్తారు- చంద్రబాబు, లోకేశ్లపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు Kodali Nani : ఎన్టీఆర్ అసలైన వారసులు వస్తారు, తండ్రీ కొడుకులను తరిమేస్తారు- చంద్రబాబు, లోకేశ్లపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు](https://10tv.in/wp-content/uploads/2023/08/Kodali-Nani.jpg)
Kodali Nani
Kodali Nani – Nara Lokesh : ఏపీలో రాజకీయం హాట్ హాట్ గా మారింది. అధికార వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం ఓ లెవెల్ లో నడుస్తోంది. ఇటీవల కొడాలి నాని, వల్లభనేని వంశీ టార్గెట్ గా నారా లోకేశ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి. అంతే ధీటుగా వైసీపీ నాయకులు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. గన్నవరంలో తనను ఉద్దేశించి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 తర్వాత ఎన్టీఆర్ అసలు వారసులు వస్తారు, తండ్రీ కొడుకులను తరిమేస్తారు అంటూ చంద్రబాబు, లోకేశ్ ను ఉద్దేశించి కొడాలి నాని హెచ్చరించారు.
”లోకేశ్ బచ్చా. బాడీ పెరిగింది బుర్ర పెరగలేదు. టీడీపీకి లోకేశ్ పెద్ద గుదిబండ. కొబ్బరి నూనె రాసుకుని డైపర్ తో నడుస్తున్నాడు. నేను పొదున్నే లేవగానే లోకేశ్ వచ్చే వరకూ పోసుకోకుండా ఆగాలా? కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుని మంత్రిని చేస్తే రొమ్ము గుద్ది టీడీపీలోకి రాలేదా? NTR రొమ్ము గుద్ది పార్టీ లాక్కొలేదా..?
Also Read.. Mylavaram: మళ్లీ హీటెక్కిన మైలవరం రాజకీయం.. వైసీపీకి తప్పని తలనొప్పులు
రెడ్ బుక్ ను ఎక్కడైనా తీసుకోమనండి. లోకేశ్ రెడ్ బుక్ చూసి ఎవడు భయపడతాడు? తండ్రీ కొడుకులు నన్ను ఏమీ పీకలేరు. 2024 తర్వాత NTR అసలైన వారసులు వస్తారు. తండ్రీ కొడుకులను తరిమేస్తారు. పక్క దేశాల్లో బతికే యార్లగడ్డ వెంకట్రావు నా గురించి మాట్లాడుతున్నాడు. బ్రెయిన్, బొచ్చు లెస్ వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పలా?
హరికృష్ణ, వంగవీటి రంగా, జూనియర్ ఎన్టీఆర్ నాకు క్లోజ్ అని నేను చెప్పానా? జూనియర్ ఎన్టీఆర్ నాకు క్లోజో కాదో ప్రజలకి తెలుసు. నేను రంగా అభిమానినో కాదో రాధాను అడిగితే చెప్తారు” అని కొడాలి నాని నిప్పులు చెరిగారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేవ్ యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా గన్నవరంలో భారీ సభలో లోకేశ్ మాట్లాడారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలు టార్గెట్ గా నిప్పులు చెరిగారు. గుడివాడలోనే నిన్ను డ్రాయర్ పై ఊరేగిస్తా అంటూ కొడాలి నానికి, పిల్ల సైకోకి భయం అంటే ఏంటో పరిచయం చేస్తా అంటూ వల్లభనేని వంశీకి నారా లోకేశ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. లోకేశ్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేశాయి.