Nara Lokesh : నిన్ను డ్రాయర్ మీద ఊరేగిస్తా, పిల్ల సైకోకు భయం పరిచయం చేస్తా- నిప్పులు చెరిగిన నారా లోకేశ్

ఇంకోసారి మరో తల్లి గురించి మాట్లాడాలంటే భయపడేలా చేస్తాం. కర్రలు భక్తులకు కాదు.. వైసీపీ నేతలను బాదడానికి ప్రజలకివ్వాలి. Nara Lokesh - Kodali Nani

Nara Lokesh : నిన్ను డ్రాయర్ మీద ఊరేగిస్తా, పిల్ల సైకోకు భయం పరిచయం చేస్తా- నిప్పులు చెరిగిన నారా లోకేశ్

Nara Lokesh

Nara Lokesh – Kodali Nani : గన్నవరం బహిరంగ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. సీఎం జగన్, కొడాలి నాని, వల్లభనేని వంశీ టార్గెట్ గా ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. కొడాలి నాని.. నిన్ను డ్రాయర్ మీద గుడివాడలోనే ఊరేగిస్తా. పిల్ల సైకో వంశీకి భయం పరిచయం చేస్తా అంటూ ఆవేశంగా మాట్లాడారు నారా లోకేశ్.

కృష్ణా జిల్లా మనవడిగా, అల్లుడిగా పాదయాత్ర చేయడం నా అదృష్టం. జగన్ పిరికి వాడు. జగన్ పాదయాత్రకు టీడీపీ ప్రభుత్వం అవసరానికి మించి సెక్యూరిటీ కల్పించాం. పాదయాత్ర చేసుకో బిడ్డా అంటూ పంపాం. నేను పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి అడుగుడగునా అడ్డుకున్నారు. ఆనాడే చెప్పాను. సాగనిస్తే పాదయాత్ర లేకుంటే దండయాత్ర అని. లోకేశ్ పాదయాత్ర చేస్తుంటే జగన్ కు కాలినొప్పి వచ్చింది. ఇచ్చిన హామీల విషయంలో పదే పదే మడమ తిప్పారు. అందుకే మడమ నొప్పి వచ్చింది. జగన్ ఇసుక తింటున్నారు. ప్రతి రోజూ ఇసుక దందాలో ఐదేళ్లల్లో రూ.5400 కోట్లు దోచుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇసుక, సిమెంట్, ఇనుము ధరలు తగ్గిస్తాం.

Also Read..Mangalagiri Constituency: లోకేశ్ జోరుకు బ్రేక్‌లు వేసేదెవరు.. ఆర్కేను బాపట్లకు మారుస్తారా?

తిరుమల భక్తులకు కర్రలు ఇస్తారట. కర్రలు భక్తులకు కాదు.. వైసీపీ నేతలను బాదడానికి ప్రజలకివ్వాలి. కరెంట్ ఛార్జీలు, నిత్యావసర ధరలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. గాలు మీద కూడా పన్ను వేస్తారు. జగన్ కటింగ్-ఫిటింగ్ మాస్టర్. దేశంలో వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి సైకో జగన్. దళితులపై దాడులు చేసి అవమానిస్తున్నారు. ఓ దళిత యువకుడు మంచి నీళ్లు అడిగితే మూత్రం పోశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.

పోలీసులకు రావాల్సిన అలవెన్సులను జగన్ కట్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జీవో 79 రద్దు చేస్తాం. లోకేశ్ క్షమాపణ చెప్పాకే అడుగుపెట్టాలని వైసీపీ కుక్కలు అంటున్నాయి. అమ్మ లాంటి అమరావతికి జగన్ అన్యాయం చేస్తే చప్పట్లు కొట్టిన వైసీపీ కుక్కలు నన్ను నిలదీస్తాయా..? కృష్ణా జిల్లాకు హెచ్ సీఎల్ సంస్థను నేను తెచ్చా. జగన్ ఏం చేశారు? క్యాసినోలు తెచ్చారు. కృష్ణా జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్దం.

సన్న బియ్యం సన్నాసి మంత్రిగా అయ్యాడు. గుట్కా తినడం తప్పం మరేమీ చేతకాదు. గుడివాడలో కొడాలి నానిని కట్ డ్రాయర్ తో నడిపిస్తాం. ఇంకోసారి మరో తల్లి గురించి మాట్లాడాలంటే భయపడేలా చేస్తాం. దేవాదాయ శాఖ నిర్వహించడం తెలియని కొబ్బరి చిప్పల దొంగ మంత్రి. జోకర్ జోగి.. చంద్రబాబు ఇంటి మీదకు వస్తాడా..? ఇప్పుడు రా బిడ్డా. రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం.

Also Read..Chirala: ఆమంచి, కరణం గ్రూప్‌వార్‌.. వైసీపీ ట్రబుల్ షూటర్‌ ఎంట్రీతో పరిస్థితులు చక్కబడతాయా?

గన్నవరంలో ఓ పిల్ల సైకో ఉన్నాడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు సార్ సార్ అంటుండేవాడు. కూర్చొవయ్యా అంటే.. వద్దు సార్ అనేవాడు. పిల్ల సైకో చాలా పెద్ద నటుడు. పిల్ల సైకోకు భయం పరిచయం చేస్తా. దొంగ కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడానికి జుడీషియల్ ఎంక్వైరీ వేస్తాం. దొంగ కేసులు పెట్టిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాశాం” అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు నారా లోకేశ్.