Kadapa Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులంతా తాడిపత్రి వాసులు ..

కడప జిల్లా కొండాపురం మండలం ఏటూరు గ్రామం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Kadapa Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులంతా తాడిపత్రి వాసులు ..

Road Accident

Road Accident YSR District: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాను వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఒక పాప, ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మరో ఐదుగురికి గాయాలు కాగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీలు వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా తాడిపత్రికి చెందిన వారిగా అధికారులు తెలిపారు.

Kakinada Road Accident : కాకినాడ జిల్లా తాళ్లరేవు రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య

కడప జిల్లా కొండాపురం మండలం ఏటూరు గ్రామం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులంతా తుఫాన్ వాహనంలోని వారే. అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్ణాటకలోని బళ్లారికి చెందిన 14 మంది బంధువులు తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి తుఫాన్ వాహనంలో వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం అదే వాహనంలో స్వగ్రామాలకు బయలుదేరారు. ఏటూరు గ్రామం సమీపంలోకి రాగానే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Karnataka Election Result 2023: కర్ణాటక ఫలితాలపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ విజయం గురించి ఏమన్నారంటే..

ప్రమాదం సమాచారం అందుకున్న సీఐ సుదర్శన్ ప్రసాద్, ఎస్ఐ సత్యనారాయణ సంఘటనా స్థలికి చేరుకొని ప్రమాదంకు గల కారణాలను తెలుసుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతుల వివరాలు..

కే సుధీర్ కుమార్ (తుఫాన్ డ్రైవర్), కే సుధ, కే లికిత్ కుమార్ రెడ్డి, ఎల్ లక్ష్మీదేవి, కే సునీల్ కుమార్ రెడ్డి, సుభద్ర, బుజ్జి (రెండు సంవత్సరాల పాప). మృతి చెందిన వారు తాడిపత్రికి చెందిన వారు. అయితే వీరిలో కొంతమంది బళ్లారి జిల్లా కంఫ్లీ‌లో నివాసం ఉంటున్నట్లు సమాచారం

ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు..

ఆదిలక్ష్మి (30), మేఘన రెడ్డి (20), నరసింహారెడ్డి (53), కాటసాని భాస్కర్ రెడ్డి (45), జయలక్ష్మి (55). వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. మృతులు గాయపడిన వారు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. మరో 15నిమిషాల్లో వీరంతా గమ్యస్థానం చేరుకునేవారంటూ మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.