Pawan New Convoy : పవన్‌కల్యాణ్ ఏపీ పర్యటనకు నూతన కాన్వాయ్..8 బ్లాక్ స్కార్పియోలు కొనుగోలు

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం, జనసేనను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పవన్‌ చేపట్టనున్న పర్యటనకు నూతన కాన్వాయ్‌ను ఇటీవలే పార్టీ నేతలు బుక్‌ చేశారు. ఇందుకోసం కోటి 50 లక్షల రూపాయలు వెచ్చించారు.

Pawan New Convoy : పవన్‌కల్యాణ్ ఏపీ పర్యటనకు నూతన కాన్వాయ్..8 బ్లాక్ స్కార్పియోలు కొనుగోలు

Pawan

Pawan new convoy : జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఏపీ పర్యటనకు నయా కాన్వాయ్ సిద్ధంగా ఉంది. నూతన కాన్వాయ్‌లోని ఎనిమిది స్కార్పియోలకు అర్చకులు ఇవాళ పూజ చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో వాహనాలకు పూజ జరిగింది. అక్టోబర్‌ 5న తిరుపతి నుంచి పవన్‌కల్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్న జనసేనాని దసరా పండుగ రోజు నుంచి క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలు, సమస్యలు తెలుసుకోనున్నారు.

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం, జనసేనను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పవన్‌ చేపట్టనున్న పర్యటనకు నూతన కాన్వాయ్‌ను ఇటీవలే పార్టీ నేతలు బుక్‌ చేశారు. ఇందుకోసం కోటి 50 లక్షల రూపాయలు వెచ్చించారు. యాత్ర కోసమే కొత్తగా మహీంద్రా బ్లాక్‌ కలర్‌ స్కార్పియోలను కొనుగోలు చేశారు. బ్లాక్ స్కార్పియోలు నిన్ననే జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నాయి. జనసేన నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా పవన్‌ నూతన కాన్వాయ్‌ను తిలకించారు.

Pawan Kalyan : జనంలోకి జనసేనాని..ఏపీలో అక్టోబర్ 5 నుంచి పవన్ పర్యటన

రూట్‌మ్యాప్‌ ప్రకారం అన్ని నియోజకవర్గాల్లోనూ పవన్‌ పర్యటన కొనసాగనుంది. ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ బహిరంగ సభ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పెరుగుతున్న అప్పు భారంతో పాటు.., ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని జనసేన పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో జగన్‌ సర్కార్‌…ముందస్తు ఎన్నికలకు సై అంటుందని విశ్లేషిస్తున్నారు. ఎన్నికల వేళ యాత్ర చేపట్టినా పెద్దగా ఫలితం ఉండదని భావిస్తున్న జనసేన నేతలు.. అక్టోబర్‌ నుంచి పవన్‌తో యాత్ర చేయించేలా ప్లాన్ చేశారు. ఈ యాత్రలో నూతన కాన్వాయ్‌ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది.