Konaseema Tension: పోలీసుల వలయంలో అమలాపురం.. అదుపులోకి వచ్చిన పరిస్థితులు..

కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కారులు విధ్వంసం సృష్టించడంతో కోనసీమ జిల్లా అమలాపురం రణరంగంగా మారింది. రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మివరం ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టిన విషయం విధితమే. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం అమలాపురంలో పరిస్థితులు అదుపులోకి వచ్చినట్లు పోలీస్ అధికారులు తెలిపారు..

Konaseema Tension: పోలీసుల వలయంలో అమలాపురం.. అదుపులోకి వచ్చిన పరిస్థితులు..

Konaseema

Konaseema Tension: కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కారులు విధ్వంసం సృష్టించడంతో కోనసీమ జిల్లా అమలాపురం రణరంగంగా మారింది. రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మివరం ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టిన విషయం విధితమే. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇతర జిల్లాల నుంచి భారీగా అమలాపురం చేరుకున్న పోలీసులు ఆందోళనల కారులను చెదరగొట్టారు. ప్రస్తుతం అమలాపురంలో పరిస్థితులు అదుపులోకి వచ్చినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి అమలాపురం భారీ లో వర్షం కురుస్తుంది. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అక్కడే మకాంవేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అమలాపురంలో ఎవరూ బయటకు రావొద్దని ఆంక్షలు విధించారు. సెక్షన్ 144 , 30 సెక్షన్ అమలు చేస్తున్నారు.

Konaseema Tension : హింసాత్మక ఘటనలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు : ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు

మరోవైపు అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకుగాను అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కోనసీమ వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేయాలని కలెక్టర్ నిర్ణయించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బుధవారం నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుందని ప్రకటించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుందని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే ఆందోళనల్లో పాల్గొన్న వారిని గుర్తించేందుకు వీడియో పుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీడియో ఫుటేజ్ ల ఆధారంగా ఆందోళన కారులపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, ఇండ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కోనసీమ వ్యాప్తంగా ఎయిల్ టెల్ తన సర్వీసులు నిలిపివేసింది. కోనసీమలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్లు తెలిసింది.

Konaseema Tension : కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి-చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సర్కార్ కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది. తాజాగా కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేద్కర్ జిల్లాగా మారుస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పేరు మార్పుపై పలువురు ఆ ప్రాంత వాసులు కోనసీమనే ముద్దు, మరే పేరు వద్దు అంటూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోనసీమ సాధన సమితి గళమెత్తింది. ఈ క్రమంలో మంగళవారం పలువురు ఆందోళన కారులు మంత్రి, ఎమ్మెల్యే ఇండ్లకు నిప్పుపెట్టడం, వాహనాలు దగ్దం చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పోలీసులు పటిష్ట బందోబస్తుతో కోనసీమ జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.