Wife Illegal Affair: ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య.. ఐదు నెలల తర్వాత నిందితులను పట్టించిన సెల్ ఫోన్.. ఎలా అంటే?

వివాహేతర సంబంధం మోజులో పడిన భార్య.. తన భర్తను హత్యచేసింది. ప్రియుడు అతని స్నేహితులతో కలిసి భర్తను అడ్డుతొలగించుకోవటమే కాక.. ఏమీ తెలియనట్లు తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదు నెలల తరువాత నిందితులను గుర్తించారు.

Wife Illegal Affair: ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య.. ఐదు నెలల తర్వాత నిందితులను పట్టించిన సెల్ ఫోన్.. ఎలా అంటే?

Illegal Affair

Wife Illegal Affair: వివాహేతర సంబంధం మోజులో పడిన భార్య.. తన భర్తను హత్యచేసింది. ప్రియుడు అతని స్నేహితులతో కలిసి భర్తను అడ్డుతొలగించుకోవటమే కాక.. ఏమీ తెలియనట్లు తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదు నెలల తరువాత నిందితులను గుర్తించారు. భార్యే ప్రియుడు, అతని స్నేహితుల సహాయంతో భర్తను హత్యచేయించినట్లు నిర్ధారించిన పోలీసులు మృతుడు భార్య, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో నిందితులను సెల్ ఫోన్ ఆధారంగా గుర్తించారు.

Illegal affair: నీ భార్య నాతో ఏం చేస్తుందో చూడంటూ భర్తకు వీడియో.. పోలీస్ ఎంట్రీతో..

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రాంతానికి చెందిన కుంబిరిక రాజు శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలంలోని చిన్నకొల్లి వలసలో కొన్నేళ్ల క్రితం స్థిరపడ్డాడు. పదేళ్ల క్రితం రాజుకు అదే మండలానికి చెందిన సుజాతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇదే సమయంలో సుజాతకు పాడలి గ్రామానికి చెందిన బురళ్ల రాము అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అయితే సుజాత భర్త పనుల నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటుండటంతో రాము, సుజాతకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తను అడ్డుతొలగించుకుంటే కలిసి జీవించవచ్చునని భావించిన భార్య.. ఇదే విషయాన్ని ప్రియుడు రాముకు చెప్పింది. ఇందుకోసం తన స్నేహితులతో కలిసి రాము ప్రణాళిక రచించాడు.

Wife illegal affair: భార్య అక్రమ సంబంధం భర్త ప్రాణం తీసింది.. పోలీసుల విచారణలో ఊహించని ట్విస్ట్..

ఈ ఏడాది ఏప్రిల్ 4న హిరమండలంలోని భార్య వద్దకు రాజు తిరిగి వచ్చాడు. అప్పటికే రాజును హత్యచేసేందుకు రాము (సుజాత ప్రియుడు) ప్లాన్ సిద్ధంచేసుకున్నాడు. తొలుత రాజుతో స్నేహం పెంచుకున్నాడు. ఏప్రిల్ 6న రాము, అతని స్నేహితుడు నూకరాజులు రాజును వంశధార నది పక్కనకు తీసుకెళ్లి మద్యం తాగించారు. రాజు అపస్మారక స్థితిలోకి వెళ్లాక ఆటోలో కొద్దిదూరం తీసుకెళ్లి హత్యచేసి మృతదేహాన్ని పొదల్లో వేశారు. సుజాత సూచన మేరకు మృతదేహాన్ని తగలబెట్టారు. భార్య సుజాత ఏమీ తెలియనట్లు తన భర్త కనిపించడం లేదని ఏప్రిల్ 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సెల్ ఫోన్ ఆధారంగా కేసును ఛేధించారు. నిందితులు మృతుడి భార్య సుజాత, ఆమె ప్రియుడు, అతని స్నేహితులేనని తేల్చారు. వారిని అదుపులోకి తీసుకొని ఆముదాల వలస కోర్టులో హాజరుపర్చారు.