Srisailam: శ్రీశైలం ఘాట్ రోడ్డులో టీఎస్ ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం

ఈ ఘటన ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు డ్యాం వద్దకు రాగానే అదుపుతప్పింది. ఈ సమయంలో బస్సు డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోయాడు. దీంతో ఘాట్ రోడ్డుపై ఉన్న రక్షణ గోడను ఢీకొని ఆగిపోయింది.

Srisailam: శ్రీశైలం ఘాట్ రోడ్డులో టీఎస్ ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం

Srisailam: శ్రీశైలం దగ్గర తెలంగాణ ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు శ్రీశైలం దగ్గర లోయలో పడబోయింది. డ్యాం సమీపంలోని టర్నింగ్ వద్ద అదుపుతప్పి గోడను ఢీకొంది. అయితే, గోడకు ముందు ఇనుపరాడ్లు ఉండటంతో బస్సు లోయలో పడిపోకుండా, రోడ్డు అంచున నిలిచిపోయింది. దీంతో బస్సు లోయలో పడకుండా పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది.

Gujarat: పంచాయత్ జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ పేపర్ లీక్.. పరీక్ష రద్దు చేసిన ప్రభుత్వం

ఈ ఘటన ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు డ్యాం వద్దకు రాగానే అదుపుతప్పింది. ఈ సమయంలో బస్సు డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోయాడు. దీంతో ఘాట్ రోడ్డుపై ఉన్న రక్షణ గోడను ఢీకొని ఆగిపోయింది. గోడ ధ్వంసమైనప్పటికీ బస్సు మాత్రం ప్రమాదం బారి నుంచి బయటపడింది. గోడ ఉండటం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనతో బస్సులోని 30 మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఏ ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.