బావిలో శవాలుగా తేలిన చిన్నారులు..గిరిజన గ్రామంలో విషాదం
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జేవీ పురం గ్రామంలో ఇద్దరు చిన్నారులు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. బూర్జా మండలం అననవపేట పంచాయితీలోని జేవీ పురం గిరిజన గ్రామానికి చెందిన సవరా త్రిష అనే 7 సంవత్సరాల బాలికి సవారా రాహుల్ అనే 7 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయారని సబ్ ఇన్స్పెక్టర్ జి.అప్పారావు తెలిపారు.
చిన్నారుల తల్లిదండ్రులు వ్యవసాయం పనుల కోసం వెళ్లగా..ఆడుకుంటుండగా ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయారనీ..పిల్లకు కేకలు వేసినా..ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవటంతో వారు చనిపోయారని తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న మేము..ఘటనాస్థలానికి చేరుకుని రాత్రి 10గంటల ప్రాంతంలో చిన్నారుల మృతదేహాలను బైటకు తీశామని తెలిపారు.
Two children died after they accidentally fell in a well at JV Puram village in Srikakulam district. There was nobody near the well to rescue them. A case has been registered and the matter is under investigation: Sub Inspector Apparao (16.06.2020) #AndhraPradesh pic.twitter.com/nWMH1TpDT2
— ANI (@ANI) June 16, 2020
Read: ఏపీలో 7 గురు తెలంగాణావాసులు మృతి..