Rajampet: రాజంపేటలో వైసీపీదే గెలుపు.. నాలుగు వార్డుల్లోనే టీడీపీ!

కడప జిల్లా రాజంపేటలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యింది.

Rajampet:  రాజంపేటలో వైసీపీదే గెలుపు.. నాలుగు వార్డుల్లోనే టీడీపీ!

Rajampet

Rajampet: కడప జిల్లా రాజంపేటలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యింది. రాజంపేటలో మొత్తం 29 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. వాటిలో వైసీపీ 24 వార్డులను సొంతం చేసుకోగా.. టీడీపీ 4, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక వార్డును కైవసం చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా క్లియర్ కట్‌గా కనిపిస్తూ ఉండగా.. కడప జిల్లాలో మరోసారి సత్తా చాటింది వైఎస్ఆర్ కాంగ్రెస్.

వార్డుల వారీగా.. 1వ వార్డు షేక్ సునియా, 2వ వార్డు దాసరి మౌనిక, 3వ వార్డు నుంచి సంగిశెట్టి నవీన్ కుమార్, 4వ వార్డు నుంచి మరి రవి వైసీపీ నుంచి గెలిచారు. 5వ వార్డు మాత్రం తుపాకుల అశోక్ కుమార్ టీడీపీ నుంచి గెలుపొందారు. 6వ వార్డు నుంచి తాంబ సుబ్రహ్మణ్యం, 7వ వార్డు నుంచి నాయక్, 8వ వార్డు నుంచి హసీనా, 9వ వార్డు నుంచి సింధు, 10వ వార్డు నుంచి మౌనిక వైసీపీ తరపున గెలిచారు.

11 వ వార్డు నుంచి బుజ్జమ్మ, 13 వ వార్డు గూగుల్ల వసంత తెలుగుదేశం పార్టీ నుంచి గెలవగా.. 12వ వార్డు నుంచి రాధా, 14వ వార్డు నుంచి పెంచలయ్య, 15వ వార్డు నుంచి రమణారెడ్డి, 16వ వార్డు నుంచి విజయలక్ష్మి, 17వ వార్డు నుంచి పోల శ్రీనివాసులు రెడ్డి, 18వ వార్డు నుంచి దివ్య తేజ, 19వ వార్డు నుంచి డొంక సురేష్, 20వ వార్డు నుంచి తోట వాణి, 21వ వార్డు నుంచి పొల రమణారెడ్డి, 22వ వార్డు కొవ్వుల ప్రతాప్, 23వ వార్డు పసుపులేటి సుధాకర్, 24వ వార్డు నుంచి శ్వేతా రెడ్డి వైసీపీ నుంచి గెలుపొందారు.

25వ వార్డు నుంచి మిరియాల చంగమ్మ టీడీపీ తరపున గెలవగా.. 26 వ వార్డు నుంచి హైమావతి, 28వ వార్డు నుంచి చప్పిడి కళావతి, 29వ వార్డు నుంచి షేక్ నాయమతుల్లా వైసీపీ నుంచి గెలిచారు.