SiddeswaraKona Water Falls : సిద్ధేశ్వరకోనలో అదృశ్యమైన యువకుడు మృతి

నెల్లూరు జిల్లా రాపూరు మండలం వెలుగొండ అడవుల్లోని సిద్దేశ్వరకోనలో నిన్న అదృశ్యమైన కిషోర్ అనే యువకుడు మరణించాడు. ప్రమాదవశాత్తు వాటర్ ఫాల్స్ వద్ద ఉన్న నీటి గుంతలో పడి మృతి చెందిన కిషో

SiddeswaraKona Water Falls : సిద్ధేశ్వరకోనలో అదృశ్యమైన యువకుడు మృతి

Nellore Yound Man Death

SiddeswaraKona Water Falls:  నెల్లూరు జిల్లా రాపూరు మండలం వెలుగొండ అడవుల్లోని సిద్ధేశ్వరకోన లో నిన్న అదృశ్యమైన కిషోర్ అనే యువకుడు మరణించాడు. ప్రమాదవశాత్తు వాటర్ ఫాల్స్ వద్ద ఉన్న నీటి గుంతలో పడి మృతి చెందిన కిషోర్ మృతదేహాన్ని ఈరోజు గుర్తించారు. పోస్టుమార్టం కోసం రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గూడురు మండలం చౌటపాలెంకు చెందిన ఐదుగురు యువకులు నిన్న ఆదివారం కావటంతో రాపూరు మండలంలోని రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్‌కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్న సిద్ధేశ్వరకోన జలపాతం తిలకించేందుకు వెళ్లారు.అక్కడ కాసేపు జలపాతంలో జలకాలాడి తిరిగి ప్రయాణమయ్యారు.

Also Read : Mokshada Ekadashi 2021 : రేపు మోక్షద ఏకాదశి

జలపాతం నుండి కొంతదూరం వచ్చాక కిషోర్ అనే యువకుడు కనపడక పోవటంతో మిగిలిన స్నేహితులు అతని కోసం గాలింపు చేపట్టారు. కొంతసేపు వెతికిన తర్వాత అటవీ ప్రాంతం కావటంతో వారు ఊరులోకి వచ్చి కిషోర్ అటవీ ప్రాంతంలో తప్పిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.   కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈరోజు ఉదయం జలపాతం వద్ద గజ ఈతగాళ్లతో, ఫారెస్ట్ అధికారులతో గాలించగా కిషోర్ మృతదేహం జలపాతంలో లభించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.