YSR Rythu Bharosa : రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి

అర్హులైన రైతులకు రూ.2వేల చొప్పున అకౌంట్లలో వేసింది ప్రభుత్వం. కాగా, అకౌంట్ లో డబ్బులు పడ్డాయో? లేదో? తెలుసుకోవడం ఎలా?

YSR Rythu Bharosa : రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి

Ysr Rythu Bharosa Money

YSR Rythu Bharosa : వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ మూడో విడత నిధులను ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేడు జమ చేసింది. అర్హులైన రైతులకు రూ.2వేల చొప్పున అకౌంట్లలో వేసింది ప్రభుత్వం. కాగా, తమ అకౌంట్ లో రైతు భరోసా డబ్బులు పడ్డాయో? లేదో? తెలుసుకోవడం ఎలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఇందుకోసం మీ ఆధార్ నెంబర్ చాలు.. సులభంగా స్టేటస్ తెలుసుకునే అవకాశముంది.

* https://ysrrythubharosa.ap.gov.in/RBApp/index.html వెబ్ సైట్ ఓపెన్ చేయాలి
* హోమ్ పేజీలో నో యువర్ స్టేటస్ కనిపిస్తుంది. దాని కింద రెండు ఆప్షన్లు వస్తాయి.
* అందులో నో యువర్ రైతు భరోసా స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
* ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. దీంతో డబ్డులు జమ అయ్యాయో లేదో తెలిసిపోతుంది.

New Year Amazon Deal: రూ.65వేల OnePlus 9Pro 5G ఫోన్ 30వేలకే!

అర్హత ఉన్నా.. ఒకవేళ ఎవరికైనా నగదు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారంలోపు ఎప్పుడైనా డబ్బులు జమ కావొచ్చని అధికారులు చెప్పారు. అప్పటికీ నగదు జమ కాకుంటే దగ్గర్లో ఉన్న సచివాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తే.. మీ ఆధార్ కార్డు ఆధారంగా వెంటనే వివరాలు అప్ లోడ్ చేస్తారని వివరించారు. ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తించి వెంటనే నగదు పడేలా చేస్తారని వెల్లడించారు. నగదు జమ కాకపోయినా, ఇతర సమస్యలు ఏవైన ఉంటే 1902 నెంబర్ కు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.

ఏపీ సీఎం జగన్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి మూడో విడత నిధులను విడుదల చేశారు. 50లక్షల 58వేల 489 మంది అన్నదాతల ఖాతాల్లోకి రూ.1,036 కోట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేశారు. వైఎస్ఆర్ రైతు
భరోసా-పీఎం కిసాన్ పథకం గత మూడేళ్లుగా అమలవుతోంది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే రెండు విడతల సొమ్మును రైతుల ఖాతాలో జమ చేశారు.

Fenugreek Seeds : చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గించే మెంతులు

మూడు విడతలు కలిపి 2021-22లో రూ.6,899.67 కోట్లు పెట్టుబడి సాయం అందించినట్లు అవుతుంది. సామాజిక తనిఖీలో భాగంగా రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలనికే.. 2019 అక్టోబర్‌ 15న శ్రీకారం చుట్టిన ఈ పథకం కింద తొలి ఏడాది 45లక్షల రైతు కుటుంబాలకు రూ.6,162.45 కోట్లు జమ చేశారు.

ఈ మొత్తంలో పీఎం కిసాన్‌ కింద రూ.2,525 కోట్లు కేంద్రం, వైఎస్సార్‌ రైతుభరోసా కింద రూ.3,637.45 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భరించాయి. ఇక రెండో ఏడాది 2020-21లో 49.40 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,750.67 కోట్లు జమచేశారు. ఇందులో వైఎస్సార్‌ రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.3,784.67 కోట్లు జమచేయగా, పీఎం కిసాన్‌ కింద రూ.2,966 కోట్లు కేంద్రం అందించింది.

ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 13,500 పెట్టుబడి సాయాన్ని విడతల వారీగా అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇందులో మొదటి విడతగా ఖరీఫ్‌ పంట వేసే ముందు అంటే మే నెలలో రూ. 7,500, రెండవ విడతగా అక్టోబర్‌ నెల ముగిసేలోపే ఖరీఫ్‌ పంట కోత సమయం, రబీ అవసరాల కోసం రూ. 4వేలు.. మూడవ విడతగా ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరి నెలలో రూ. 2వేలు చొప్పున ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తోంది.

తాజా నగదుతో కేవలం 2021-22 సీజన్‌లో 6,899.67 కోట్లు రూపాయల నగదు జమ కానుండగా, గడిచిన మూడేళ్లలో ఈ పథకం కోసం రూ.19,812.79 కోట్ల పెట్టుబడి సాయం అందించింది ఏపీ ప్రభుత్వం.