CM Ys Jagan: వచ్చే నెలలో సీఎం జగన్ దావోస్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2022’లో పాల్గొననున్నారు.

CM Ys Jagan: వచ్చే నెలలో సీఎం జగన్ దావోస్ పర్యటన

Ys Jagan

CM Ys Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2022’లో పాల్గొననున్నారు. మే 22న ఆయన దావోస్ చేరుకుంటారు. ఈ సదస్సు మే 22-26 వరకు జరుగుతుంది. సదస్సు జరిగే వారం రోజులపాటు ఆయన అక్కడే ఉంటారు.

CM Ys Jagan : మంత్రి పదవులకు వస్తాయనుకున్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు CM జగన్ ఎందుకు షాక్ ఇచ్చారు?!

ఈ సందర్భంగా ఏపీకి పెట్టుబడులను తెచ్చేందుకు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమవుతారు. ఈ సదస్సు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ సదస్సులో పలు దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు వివిధ కేటగిరీల కింద అవార్డులు కూడా అందజేస్తారు. మన దేశం నుంచి ఈసారి పలువురు యువ పారిశ్రామికవేత్తలు ఈ అవార్డుల కోసం పోటీ పడుతున్నారు.