Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా.?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలో బుధవారం పెరుగుదల చోటు చేసుకుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..
Gold and Silver Rate Today : భారత్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ఖరీదైనవిగా మారుతున్నాయి. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అటు పెళ్లిళ్ల సీజన్, ఇటు పండుగ కావడంతో బంగారం కొనుగోలుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. అయితే, వారికి బంగారం ధరలు షాకిస్తున్నాయి. తాజాగా బుధవారంసైతం బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 200 పెరగ్గా, 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 240 పెరిగింది. వెండి ధర మాత్రం తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బుధవారం బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో ఓసారి చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలో బుధవారం పెరుగుదల చోటు చేసుకుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 56,550 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 61,690 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,700 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 61,840కు చేరింది.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690 కు చేరింది.
– చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 56,750 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,910కి చేరింది.
తగ్గిన వెండి ధర ..
దేశ వ్యాప్తంగా మంగళవారం కిలో వెండిపై రూ. 200 తగ్గగా.. బుధవారం రూ. 500 తగ్గింది. దీంతో రెండు రోజుల్లో కిలో వెండిపై రూ. 700 తగ్గుదల చోటు చేసుకుంది. దీంతో బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 78,000 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,000. ముంబయి, ఢిల్లీ, కోల్కతా ప్రాంతాలలో రూ.74,600గా ఉంది. బెంగళూరులో కిలో వెండి రూ.74,000 వద్దకు చేరింది.