Mumbai: 11 ఏళ్ల స్నేహితురాలిపై ముగ్గురితో అత్యాచారం చేయించడమే కాకుండా, అక్కడే ఉండి చూస్తూ పైశాచిక ఆనందం

ఆ సమయంలో తన స్నేహితుల్లో ఒకరితో లైంగిక సంబంధం పెట్టుకొమ్మని 11 ఏళ్ల బాలికను యువతి బెదిరించింది. బాలిక అరుపుల మధ్య ముగ్గురు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. అత్యాచారం జరుగుతున్నంత సేపు 21 ఏళ్ల ఆ యువతి అక్కడే ఉండి, జరిగే దారుణాన్ని చూస్తూ పైశాచిక ఆనందం పొందింది. అనంతరం బుధవారం తెల్లవారు జామున బాలికను వారి ఇంటి సమీపంలో దిగబెట్టి వెళ్లారు.

Mumbai: 11 ఏళ్ల స్నేహితురాలిపై ముగ్గురితో అత్యాచారం చేయించడమే కాకుండా, అక్కడే ఉండి చూస్తూ పైశాచిక ఆనందం

Mumbai woman gets 3 men to rape 11 year old friend stays to watch act

Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం వెలుగు చూసింది. 21 ఏళ్ల ఒక యువతి.. 11 ఏళ్ల తన స్నేహితురాలిపై ముగ్గురు వ్యక్తులతో సామూహిక అత్యాచారం చేయించింది. అంతే కాకుండా అత్యాచారాన్ని అక్కడే ఉండి చూస్తూ పైశాచిక ఆనందం పొందింది. మంగళవారం (ఆగస్టు 16) జరిగిన ఈ ఘటన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ద్వారా వెలుగులోకి వచ్చింది. కాగా, ఫిర్యాదు అందుకున్న ఆరు గంటల్లోనే అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు యువకులు సహా, ప్రధాన నిందితురాలైన యువతిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముంబైలోని విరార్ (పశ్చిమ) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

మంగళవారం సాయంత్రం 7 గంటలకు బాధితురాలు పాడైన తన మొబైల్ ఫోన్‭ను రిపేర్ చేయించడానికి వెళ్తున్న క్రమంలో 21 ఏళ్ల స్నేహితురాలు వచ్చి అలా షికారుకు వెళ్తాదమని తీసుకెళ్లింది. విరార్ సమీపంలో మనుషులు సంచారం లేని ఒక ప్రాంతంలోకి తీసుకెళ్లిన అనంతరం తన ముగ్గురు మగ స్నేహితులను పిలిచింది. వారు 11 ఏళ్ల బాలికను గణేష్ మండపానికి (వినాయక చవితి సందర్భంగా నిర్మాణంలో ఉంది) వెనుక వైపుకు తీసుకెళ్లి బలవంతం చేశారు.

Hyderabad : నారాయణ కాలేజీలో ఒంటికి నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‪‌ను పట్టుకున్న విద్యార్థి ఘటనలో బిగ్ ట్విస్ట్..!!

ఆ సమయంలో తన స్నేహితుల్లో ఒకరితో లైంగిక సంబంధం పెట్టుకొమ్మని 11 ఏళ్ల బాలికను యువతి బెదిరించింది. అందుకు బాలిక ఒప్పుకోలేదు. బాలిక అరుపుల మధ్య ముగ్గురు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. అత్యాచారం జరుగుతున్నంత సేపు 21 ఏళ్ల ఆ యువతి అక్కడే ఉండి, జరిగే దారుణాన్ని చూస్తూ పైశాచిక ఆనందం పొందింది. అనంతరం బుధవారం తెల్లవారు జామున బాలికను వారి ఇంటి సమీపంలో దిగబెట్టి వెళ్లారు.

బాలికి ఇంటికి వెళ్లిన అనంతరం కుటుంబ సభ్యులతో జరిగిన విషయం చెప్పింది. వెంటనే వారు ఆమెను తీసుకుని పోలీసులను సంప్రదించారు. పోలీసులు బాలిక స్నేహితురాలిని ట్రాక్ చేసి.. మిగతా ముగ్గురి వివరాలు తీసుకుని కొద్ది సమయంలోనే నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురిలో ఒకరు 21 ఏళ్ల యువతి కాలేజీ స్నేహితుడు కాదా మరొక వ్యక్తి స్థానికంగా కూరగాయలు అమ్మే వ్యక్తి. వీరిద్దరూ విరార్‭లోనే నివసిస్తారు. ఇంకొక వ్యక్తి బయట పరిచయం అయిన స్నేహితుడట. నిందితులపై ఐపీసీలోని సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి కస్టడీలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు.

Jharkhand: తోటి ఖైదీని చంపిన 15 మంది ఖైదీలకు ఉరిశిక్ష