Hyderabad : నారాయణ కాలేజీలో ఒంటికి నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‪‌ను పట్టుకున్న విద్యార్థి ఘటనలో బిగ్ ట్విస్ట్..!!

హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లోని నారాయణ కాలేజ్ లో ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ప్రిన్సిపల్ ని పట్టుకున్న ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నది ఓ సాధారణ విద్యార్థి కాదు అతను విద్యార్థి సంఘం నాయకుడు సందీప్ గా గుర్తించారు.

Hyderabad : నారాయణ కాలేజీలో ఒంటికి నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‪‌ను పట్టుకున్న విద్యార్థి ఘటనలో బిగ్ ట్విస్ట్..!!

Biggest twist in ramanthapur narayana college students petrol fire

twist in ramanthapur narayana college students petrol fire : హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లోని నారాయణ కాలేజ్ లో ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ప్రిన్సిపల్ ని పట్టుకున్న ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నది ఓ విద్యార్థి కాదు అతను విద్యార్థి సంఘం నాయకుడు సందీప్ గా గుర్తించారు. ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డితో చర్చించటానికి వచ్చి సాయినాథ్ తో కలిసి కాలేజీకి వచ్చిన సందీప్ ప్రిన్సిపాల్ ను బెదిరించటానికి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.

గత సంవత్సరం నారాయణ కాలేజ్ లో ఇంటర్ పూర్తి చేసుకున్న సాయినాథ్ కు కాలేజీ యాజమాన్యం టీసీ ఇవ్వకుండా వేధిస్తోంది. కట్టాల్సిన ఫీజు బ్యాలెన్స్ ఉండటంతో యాజమాన్యం టీసీ ఇవ్వకుండా సాయినాథ్ ను ఇబ్బంది పెడుతోంది. ఈ ఏడాది ఇంజనీరింగ్ లో సాయినాథ్ జాయిన్ అవ్వాల్సి ఉంది. దీని కోసం ఇంటర్ సర్టిఫికెట్ టీసీ తప్పనిసరి కాబట్టి..దీంతో సాయినాథ్ విద్యార్థి సంఘం నాయకుడు సందీప్ సహాయం తీసుకున్నాడు. ప్రిన్సిపల్ తో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేద్దామని కాలేజీకి సాయినాథ్ తో కలిసి వచ్చాడు సందీప్. దీంతో సాయినాథ్ కాలేజీకి కట్టాల్సిన రూ.16 వేలు ఫీజును మాఫీ చేసి సర్టిఫికెట్ ఇవ్వాలని కోరాడు. దానికి ప్రిన్సిపాల్ అంగీకరించలేదు. కట్టాల్సిన ఫీజు విషయంలో తగ్గేదేలేదని ప్రిన్సిపల్ చెప్పటంతో సందీప్ ప్రిన్సిపాల్ ను బెదిరించటానికి తన కూడా తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకున్నాడు.

Also read : Hyderabad: ఒంటికి నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‪‌ను పట్టుకున్న విద్యార్థి.. ఇద్దరికీ గాయాలు

ఇక్కడే అసలైన ట్విస్ట్ జరిగింది. పక్కనే ఉన్న దీపాలపై కూడా పెట్రోల్ పడటంతో హఠాత్తుగా సందీప్ కు మంటలు ఒక్కసారిగా అంటుకున్నాయి. ఊహించని ఈ ఘటనతో సందీప్ చటుక్కున ప్రిన్సిపాల్ ను పట్టేసుకున్నాడు. అదే సమయంలో పక్కనే ఉన్న ఏవో అశోక్ రెడ్డికి కూడా మంటలు అంటుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో విద్యార్థి సంఘం నాయకుడు సందీప్ మంటల్లో బాగా కాలిపోయాడు. దీంతో అతని పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరినీ కాలేజి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన చూసిన విద్యార్థులంతా చెల్లాచెదురుగా పరుగులు తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.