Ladakh: మహిళపై అత్యాచారం.. హత్య.. నిందితుడిని పట్టించిన మెడపై గాట్లు

మహిళపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా హత్య కూడా చేశాడో నిందితుడు. అనంతరం అక్కడ్నుంచి పారిపోయాడు. కానీ, పోలీసులు అతడి మెడపై కొన్ని గాట్లు ఉండటం గుర్తించారు. దీంతో నిందితుడిని విచారించగా అసలు విషయం బయటపడింది.

Ladakh: మహిళపై అత్యాచారం.. హత్య.. నిందితుడిని పట్టించిన మెడపై గాట్లు

Ladakh: లదాఖ్‌లోని లేహ్ జిల్లాలో దారుణం జరిగింది. మహిళపై హత్యాచారానికి పాల్పడ్డాడో నిందితుడు. గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. 55 ఏళ్ల ఒక మహిళపై రిజ్వాన్ దావా అనే 32 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసి, హత్యకు పాల్పడ్డాడు. అనంతరం అక్కడ్నుంచి పారిపోయాడు.

Nirmala Sitharaman: ప్రాజెక్టుల వ్యయాన్ని ఇష్టం వచ్చినట్లుగా పెంచారు.. తెలంగాణ ప్రభుత్వంపై నిర్మలా సీతారామన్ ఫైర్

షెన్యాం ప్రాంతంలో ఒక మహిళ ఆమె ఇంట్లోనే హత్యకు గురై ఉండటం గురించి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మహిళపై అత్యాచారం కూడా జరిగిందని గుర్తించారు. వెంటనే ఒక ప్రత్యేక బృందాన్ని ఈ కేసు విచారణ కోసం పోలీసులు నియమించారు. వారు ఈ కేసు విచారణ కొనసాగిస్తుండగా, రిజ్వాన్ అనే అనుమానాస్పద వ్యక్తి గురించి తెలిసింది. వెంటనే అతడ్ని పట్టుకుని పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతడి మెడపై, భుజంపై వేళ్లతో గీరిన కొన్ని గుర్తులు కనిపించాయి.

WhatsApp: ఒక్క నెలలోనే 23 లక్షల అకౌంట్లు బ్లాక్ చేసిన వాట్సాప్.. ఎందుకో తెలుసా?

అలాగే అతడి ఒంటిపై కొన్ని రక్త మరకలను కూడా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు. నిందితుడిపై తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.