ముంబై హైవేపై రెండు కార్లు.. బైక్ ఢీ : ఆరుగురు మృతి

ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెండు కార్లు.. బైక్ ఒకేసారి ఢీకొన్నాయి.

  • Published By: sreehari ,Published On : May 10, 2019 / 02:18 PM IST
ముంబై హైవేపై రెండు కార్లు.. బైక్ ఢీ : ఆరుగురు మృతి

ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెండు కార్లు.. బైక్ ఒకేసారి ఢీకొన్నాయి.

ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెండు కార్లు.. బైక్ ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం (మే 10, 2019) సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.

హైవేపై అతివేగంతో దూసుకెళ్తున్న బైక్, రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రోడ్డుప్రమాదంలో గాయపడిన ఇద్దరిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.