ముంబై హైవేపై రెండు కార్లు.. బైక్ ఢీ : ఆరుగురు మృతి
ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెండు కార్లు.. బైక్ ఒకేసారి ఢీకొన్నాయి.
ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెండు కార్లు.. బైక్ ఒకేసారి ఢీకొన్నాయి.
ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెండు కార్లు.. బైక్ ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం (మే 10, 2019) సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.
హైవేపై అతివేగంతో దూసుకెళ్తున్న బైక్, రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రోడ్డుప్రమాదంలో గాయపడిన ఇద్దరిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.