మున్సిపల్ సిబ్బందిపై దాడిచేసిన 8 మంది అరెస్టు

  • Published By: veegamteam ,Published On : April 19, 2019 / 07:23 AM IST
మున్సిపల్ సిబ్బందిపై దాడిచేసిన 8 మంది అరెస్టు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయాల మార్కెట్ లో మున్సిపల్ సిబ్బందిపై దాడి చేసిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడితో పాటు 8 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు అయింది.

గురువారం (ఏప్రిల్ 18, 2019)న రోడ్డుపై వ్యాపారులు కూరగాయలు విక్రయిస్తుండగా వివాదం నెలకొంది. రోడ్డుపై కూరగాయలు విక్రయించే వ్యాపారులు మార్కెట్ యార్డులో విక్రయించాలని మున్సిపల్ కమిషనర్ పలుమార్లు సూచించినా పట్టించుకోలేదు. రోడ్డుపై ఉన్న కూరగాయల బుట్టలను మున్సిపల్ సిబ్బంది తొలగించింది. దీంతో ఆగ్రహించిన కొంతమంది వ్యాపారులు మున్సిపల్ సిబ్బందిపై దాడి చేశారు. గాయపడిన వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. విధులు బహిష్కరించి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టారు. జిల్లా కలెక్టర్లకు వినితి పత్రాలు అందజేశారు. దీనిపై స్పందించిన పోలీసులు 8 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.