Dog Killed Old Woman : ప్రాణం తీసిన పెంపుడు కుక్క..వృద్ధురాలిపై దాడి చేసి చంపేసింది

కాగా, మంగళవారం ఉదయం ఇంటి మేడపై ఉన్న ఆ వృద్ధురాలిపై ఆ కుక్క దాడి చేసింది. ఆమెను కరిచి చంపింది. రక్తం మడుగుల్లో పడి ఉన్న వృద్ధురాలు సుశీలాను గమనించిన ఇంటి పని మనిషి వెంటనే ఆమె కుమారుడికి సమాచారం ఇచ్చారు.

Dog Killed Old Woman : ప్రాణం తీసిన పెంపుడు కుక్క..వృద్ధురాలిపై దాడి చేసి చంపేసింది

Dog

Dog Killed Old Woman : ఉత్తర ప్రదేశ్‌లో ఓ పెంపుడు కుక్క వృద్ధురాలిపై దాడి చేసి చంపేసింది. ఈ సంఘటన లక్నోలో చోటు చేసుకుంది. సుశీలా త్రిపాఠి 83 ఏళ్ల వృద్ధురాలు రిటైర్డ్‌ స్కూల్ టీచర్. లక్నో బెంగాలీ తోలా ప్రాంతంలోని ఖైజర్‌బాగ్‌లోని ఇంట్లో చిన్న కుమారుడితో కలిసి ఉంటోంది. వారికి రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి. అందులో ఒక కుక్క పేరు పిట్ బుల్.

కాగా, మంగళవారం ఉదయం ఇంటి మేడపై ఉన్న ఆ వృద్ధురాలిపై ఆ కుక్క దాడి చేసింది. ఆమెను కరిచి చంపింది. రక్తం మడుగుల్లో పడి ఉన్న వృద్ధురాలు సుశీలాను గమనించిన ఇంటి పని మనిషి వెంటనే ఆమె కుమారుడికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న వారు ఆమెను ఆస్పపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు పేర్కొన్నారు.

Hyderabad : వీధికుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి

సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. వృద్ధురాలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన నేపథ్యంలో లక్నో మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన అధికారుల బృందం బుధవారం ఆ ఇంటికి వెళ్లింది. అయితే ఇంటికి తాళం వేసి ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఆ పిట్‌ బుల్‌ డాగ్‌ను పెంచుకునే లైసెన్స్‌ ఉందా లేదా అన్నది తెలుసుకునేందుకు ఆ ఇంటికి వెళ్లినట్లు పశువైద్యుడు డాక్టర్‌ అభినవ్‌ వర్మ తెలిపారు. బొచ్చుతో పొట్టిగా ఉండే పిట్ బుల్ డాగ్స్‌ను శిక్షణ లేని వ్యక్తులు పెంచుకోవడం చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు.