దృశ్యం సినిమా చూపించాడు : పక్కా పథకం ప్రకారమే ఆమని హత్య.. భర్త సైనేడ్ ఇలా తెప్పించాడు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఆమని హత్య కేసులో మరో ట్విస్ట్. సైనేడ్ ద్వారా భర్త రవి చైతన్య భార్యని చంపిన సంగతి తెలిసిందే. అయితే అతడికి సైనేడ్ ఎలా వచ్చింది? ఎక్కడి

  • Published By: veegamteam ,Published On : February 4, 2020 / 07:19 AM IST
దృశ్యం సినిమా చూపించాడు : పక్కా పథకం ప్రకారమే ఆమని హత్య.. భర్త సైనేడ్ ఇలా తెప్పించాడు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఆమని హత్య కేసులో మరో ట్విస్ట్. సైనేడ్ ద్వారా భర్త రవి చైతన్య భార్యని చంపిన సంగతి తెలిసిందే. అయితే అతడికి సైనేడ్ ఎలా వచ్చింది? ఎక్కడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఆమని హత్య కేసులో మరో ట్విస్ట్. సైనేడ్ ద్వారా భర్త రవి చైతన్య భార్యని చంపిన సంగతి తెలిసిందే. అయితే అతడికి సైనేడ్ ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అనేది హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి విచారణలో విస్తుపోయే నిజాలు తెలిశాయి. సాధారణంగా మూములు వ్యక్తులకు సైనేడ్ దొరికే ఛాన్స్ లేదు. ఆన్ లైన్ లో కొనుగోలు చేయడం కూడా ఈజీ కాదు. దీంతో భర్త రవికి సైనేడ్(cyanide) ఎక్కడి నుంచి వచ్చింది? అసలు సైనేడ్ గురించి ఎలా తెలిసింది? అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.

రవి చైతన్య ప్రస్తుతం బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఈ ఉద్యోగం కంటే ముందు రవి చైతన్య ఓ ప్రముఖ కెమికల్ కంపెనీలో పని చేశాడని పోలీసుల విచారణలో బయటపడింది. అక్కడ అతడికి సైనేడ్ గురించి తెలిసింది. సైనేడ్… స్వర్ణకారుల దగ్గర ఉంటుందని తెలుసుకున్న రవి.. స్థానికంగా ఉండే స్వర్ణకారులతో పరిచయం పెంచుకున్నాడు. వారి దగ్గర నుంచి సైనేడ్ సేకరించి భార్య వినియోగించే బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ లో కలిపి ఆమెకు ఇచ్చాడు. దీంతో ఆమె చనిపోయింది.

భార్యని హత్య చేయాలని నిర్ణయించుకున్న తర్వాత రవి చాలా పెద్ద ప్లాన్స్ వేశాడు. సినిమాలు చూశాడు, యూట్యూబ్ లో వీడియోలు గమనించాడు. భార్యని చంపినా కేసు నుంచి ఎలా తప్పించుకోవాలనే దానిపై పెద్ద కసరత్తే చేశాడని పోలీసులు తెలిపారు. అయితే ఆమని తల్లిదండ్రులకు అనుమానం రావడంతో.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు రవి చైతన్య. రవి చైతన్య అగ్రికల్చర్ డిగ్రీ చదివాడు. దీంతో అతడికి రసాయనాల గురించి పూర్తి అవగాహన ఉందని పోలీసులు తెలిపారు.

మదనపల్లె శేషప్ప తోటలో నివాసం ఉంటున్న బరోడా బ్యాంకు మేనేజర్‌ చేబోలు రవి చైతన్య భార్య ఆమనిని జనవరి 27న ఉదయం ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. బాత్రూమ్‌లో కిందపడి పోయి ఉందని పక్కింటి వారు ఫోన్‌ చేయగా ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు చెప్పాడు. డాక్టర్లు ప్రథమ చికిత్స అందించినా కోలుకోకపోవడంతో, మెరుగైన వైద్యం కోసం స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో వైద్యులు ప్రథమ చికిత్స అందిస్తుండగా ఆమె మృతి చెందింది.

విషయం తెలియగానే ఆమని తల్లిదండ్రులు మదనపల్లెకు చేరుకున్నారు. కూతురి మృతిపై అనుమానాలు ఉన్నాయని 2 టౌన్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేసి హతమార్చారని ఆరోపించారు. అయితే బాత్‌ రూంలో పడి చనిపోయినట్లు చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమని పేరెంట్స్‌ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

మరుసటి రోజు పోస్టుమార్టమ్‌ నివేదికలో సైనైడ్‌ ఇవ్వడంతోనే ఆమని చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించడంతో నిందితుడు రవి చైతన్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో తానే సైనేడ్‌ ఇచ్చినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. భార్యకు విషమిచ్చి చంపాల్సిన అవసరం ఎందుకొచ్చింది.. సైనేడ్‌ ఎక్కడి నుంచి తీసుకురాగలిగాడనే నిజాలు తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు.

చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన రవి చైతన్య.. మదనపల్లె బరోడా బ్యాంకు మేనేజర్‌గా పని చేస్తున్నాడు. 2015లో ఆమనితో వివాహమైంది. బ్యాంకు మేనేజర్‌ ఉద్యోగం కావడంతో రూ.15 లక్షలు కట్నమిచ్చి ఘనంగా వివాహం చేశారు ఆమని తల్లిదండ్రులు. ఆ తర్వాత ఇంకా డబ్బులు అవసరమున్నాయంటూ అల్లుడు అడగటంతో.. కూతురి కోసం పలుమార్లు డబ్బులిచ్చారు. మూడేళ్ల పాటు వారి కాపురం సజావుగా సాగింది. 

కొంత కాలంగా రవిచైతన్య అదనపు కట్నమంటూ నిత్యం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం తెలిసి భార్య…అతడిని నిలదీసింది. ఓ వైపు అడిగినంత డబ్బు తీసుకురాలేదని.. మరోవైపు తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన రవి చైతన్య.. భార్యని అంతమొందించాలనుకున్నాడు. సమయం కోసం ఎదురుచూశాడు. 

ఆమని కొంతకాలంగా విటమిన్‌-బి సమస్యతో బాధపడుతోంది. ఆమనిని హతమార్చేందుకు దీన్ని ఉపయోగించుకున్నాడు. సైనేడ్‌ లక్షణాలు గల పొటాషియం నైట్రేట్‌ను తెప్పించాడు. ఆ సైనేడ్‌ ను బీ-కాంప్లెక్స్‌ మాత్రలో పెట్టి భార్యకు ఇచ్చాడు. భర్త పన్నాగాన్ని పసిగట్టని ఆమని…కొన్ని రోజులు ఆ టాబ్లెట్లు వేసుకుంది. దీంతో ఆమె ఆరోగ్యం దెబ్బతింది. హత్యను.. ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు రవి చైతన్య. బాత్రూమ్‌లో కిందపడి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. 

అయితే మృతురాలి తల్లిదండ్రుల అనుమానమే నిజమైంది. భర్తే భార్యని చంపినట్లు తేలింది. నిందితుడు సైతం నేరం అంగీకరించడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అదనపు కట్నం వేధింపుల కేసు కింద అతడి తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. భార్యను.. భర్తే.. సైనేడ్ ఇచ్చి చంపిన ఘటన కలకలం రేపింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి కుటుంబసభ్యులే కాదు…స్థానికులు సైతం డిమాండ్‌ చేశారు.

మరోవైపు తిరుపతిలోని రవి చైతన్య ఇంటికి పోలీసులు తాళం వేశారు. అతడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దర్యాఫ్తును వేగవంతం చేశారు. లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.