ప్రియుడితో భార్య జంప్ : పిల్లలతో భర్త ఆత్మహత్య.. వాట్సాప్ లో ఫొటోలు

పెళ్లి బంధాన్ని పక్కన పెట్టేసింది.. భర్త, ఇద్దరు కూతుళ్లను కాదనుకుంది. ప్రియుడే తనకు ముఖ్యం అనుకుంది. చడిచప్పుడూ కాకుండా ఓ రోజు లవర్ తో కలిసి పారిపోయింది. అమ్మ కనిపించడం లేదని కూతుళ్లు..

  • Published By: sreehari ,Published On : April 4, 2019 / 09:13 AM IST
ప్రియుడితో భార్య జంప్ : పిల్లలతో భర్త ఆత్మహత్య.. వాట్సాప్ లో ఫొటోలు

పెళ్లి బంధాన్ని పక్కన పెట్టేసింది.. భర్త, ఇద్దరు కూతుళ్లను కాదనుకుంది. ప్రియుడే తనకు ముఖ్యం అనుకుంది. చడిచప్పుడూ కాకుండా ఓ రోజు లవర్ తో కలిసి పారిపోయింది. అమ్మ కనిపించడం లేదని కూతుళ్లు..

పెళ్లి బంధాన్ని పక్కన పెట్టేసింది.. భర్త, ఇద్దరు కూతుళ్లను కాదనుకుంది. ప్రియుడే తనకు ముఖ్యం అనుకుంది. చడిచప్పుడూ కాకుండా ఓ రోజు లవర్ తో కలిసి పారిపోయింది. అమ్మ కనిపించడం లేదని కూతుళ్లు.. భార్య కనిపించలేదని భర్త కంగారు పడ్డారు. పక్కంటి వాళ్లను, బంధువులకు ఫోన్ చేసి ఆరా తీశారు. అయినా ఫలితం లేదు. ఎక్కడికి వెళ్లిందో తెలియదు.. ప్రియుడితో కలిసి ఎక్కడికో భార్య పారిపోయిందని తెలిసి తట్టుకోలేని భర్త తీవ్ర మనస్థాపానికి గురై తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రాంతంలో జరిగింది..

కాలేజీలో ఐటీఐ టీచర్ గా పనిచేస్తున్న రిషికాంత్ సి. కుడుపల్లి తన భార్యబిడ్డలతో కలిసి బల్లార్ పూర్ లో నివాసముంటున్నాడు. అప్పటికే భార్య స్థానిక డ్రైవర్ తో ప్రేమాయణం నడుపుతోంది. ఆ విషయం ఇంట్లో పిల్లలతో సహా అందరికి తెలుసు. ఈ విషయంలో ఎన్నోసార్లు భార్యను హెచ్చరించాడు భర్త. పిల్లలు కూడా తల్లికి ఎంతో నచ్చజెప్పారు. అయినా ఆ తల్లి మనస్సు మారలేదు. ప్రియుడిపై ప్రేమ మత్తులో మునిగిన ఆ తల్లికి పిల్లల ఆవేదన కానరాలేదు. ప్రియుడితో కలిసి దూరంగా ఎక్కడైనా వెళ్లి హాయిగా బతకాలనుకుంది. 

అనుకున్నట్టుగానే ప్రేమించిన వ్యక్తితో భార్య పారిపోయింది. ఈ విషయం కాస్తా.. పొరుగువారికి తెలిసింది. భార్య చేసిన పనికి ఎంతో కుమిలిపోయాడు. పిల్లల్ని ఓదార్చలేక.. బాధను దింగమింగలేక చివరికి చావే శరణ్యమని నిర్ణయించుకున్నాడు. తన కూతుళ్లతో కలిసి రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ముందుగా ఇద్దరు కూతుళ్లు 18నెలల కార్తికీ, నారాయణి (6) ఉరేసాడు. అనంతరం కూతుళ్లు ఉరేసుకున్న ఫొటోలను వాట్సాప్ లో తన భార్యకు పంపాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

పక్కంటి వాళ్లు గుర్తించి బంధువులకు సమాచారం ఇవ్వగా.. రిషికాంత్ సోదరుడు ఇంటికి వచ్చి చూసేసరికి పిల్లలతో సహా రిషికాంత్ ఉరేసుకుని కనిపించాడు. వెంటనే తలుపులు పగలకొట్టి వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ముగ్గురు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. రిషికాంత్ సోదరుడి ఫిర్యాదు మేరకు రిషికాంత్ భార్య, ఆమె ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.