Loan Apps : లోన్‌యాప్స్ కేసులో లంచం తీసుకున్న ఈడీ అధికారి

Loan Apps : లోన్‌యాప్స్ కేసులో లంచం తీసుకున్న ఈడీ అధికారి

Loan App

Loan Apps :  లోన్ యాప్స్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. కేసు దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను తెరిపించేందుకు బెంగుళూరులో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన ఒక అధికారి రూ. 5లక్షలు లంచం తీసుకున్నట్లు గుర్తించారు.

ఈడీకి చెందిన లలిత్ బజార్డ్ అనే అధికారి ముంబైకి చెందిన అపోలో ఫైన్ వెస్ట్ ఎండీ దగ్గర నుంచి రూ. 5లక్షలు లంచం తీసుకుని తప్పుడు పత్రాలు ఇచ్చిబ్యాంకు ఖాతాల్లోని డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించాడని గుర్తించారు.

లలిత్ బజార్డ్ పై దర్యాప్తు చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆయనపై సీబీఐ కి సమాచారం ఇచ్చారు.సీసీఎస్ పోలీసుల సమాచారంతో సీబీఐ బెంగుళూరులో లలిత్ బజార్డ్ పై కేసు నమోదు చేసింది.