భార్యపై అనుమానం, పసికందును నేలకేసి కొట్టి చంపాడు

భార్యపై అనుమానం, పసికందును నేలకేసి కొట్టి చంపాడు

doubt wife : అనుమానాలు పెనుభూతాలై పోతున్నాయి. నిండు జీవితాలపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. ఈ కారణంగా సాఫీగా సాగిపోవాల్సిన సంసారాలు రోడ్డు మీదకు పడుతున్నాయి. కొంతమంది దారుణంగా ప్రవరిస్తున్నారు. ఏ మాత్రం ఆలోచించకుండా..ప్రాణాలు తీస్తున్నారు. ప్రధానంగా..భార్యపై అనుమానాలు పెంచుకున్న కొంతమంది భర్తలు..అత్యంత దారుణ ఘటనలకు పాల్పడుతున్నారు. అభం..శుభం తెలియని పిల్లల ఉసురు తీస్తున్నారు. ఇలాంటి ఘటనే చెన్నైలో చోటు చేసుకుంది.

భార్యపై అనుమానంతో…ఎనిమిది రోజుల మగబిడ్డను నేలకేసి కొట్టి చంపాడు. కేవలం తన పోలిక రాలేదనే కారణంతో…ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కడలూరుకు చెందిన ఏలుమలై లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి శివరంజని అనే మహిళతో వివాహమైంది. 2021, ఫిబ్రవరి 10వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే భార్యపై అనుమానం పెంచుకున్నాడు ఏలుమలై. 2021, ఫిబ్రవరి 18వ తేదీ గురువారం అత్తారింటికి వచ్చాడు.

బిడ్డను చూడగానే..తన పోలిక లేదంటూ గొడవకు దిగాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఆవేశంలో ఉన్న ఏలుమలై..తల్లి ఒడిలో ఉన్న పసికందును నేలకేసి కొట్టాడు. దీంతో ఆ పసికందు ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.