Spurious Liquor: కల్తీ మద్యం సేవించి 25 మంది మృతి… మరో 40 మంది పరిస్థితి విషమం

గుజరాత్‌లో నకిలీ మద్యం 25 మంది ప్రాణాలు తీసింది. మరో 40 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అక్రమ మద్యం వ్యాపారుల నిర్లక్ష్యమే దీనికి కారణం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spurious Liquor: కల్తీ మద్యం సేవించి 25 మంది మృతి… మరో 40 మంది పరిస్థితి విషమం

Spurious Liquor

Spurious Liquor: గుజరాత్‌లో దారుణం జరిగింది. కల్తీ మద్యం తాగి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులంతా ఆదివారం మద్యం సేవించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Clash In Pub: పబ్బులో యువకుడిపై అమ్మాయిల దాడి.. వీడియో వైరల్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుజరాత్, బొతాద్ జిల్లాలో స్థానికులు కొందరు ఆదివారం కల్తీ మద్యం సేవించారు. సోమవారం ఉదయంకల్లా వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు వీరిని దగ్గర్లోని భావ్‌నగర్, బొతాద్, బర్వాలా పట్టణాల్లోని ఆసుపత్రుల్లో చేర్చారు. ఇలా ఒకేసారి ఎక్కువ సంఖ్యలో, వేర్వేరు పట్టణాల్లో స్థానికులు ఆస్పత్రి పాలవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అందరూ ఒకే తరహా మద్యం సేవించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు అంచనాకు వచ్చారు. పోలీసుల అంచనా ప్రకారం.. ఈ మద్యాన్ని స్థానికంగా ఒక వ్యాపారి అక్రమంగా తయారు చేసి అమ్ముతున్నాడు. బాధితులు సేవించిన మద్యంలో మిథైల్ శాతం అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

5G spectrum auction: నేటి నుంచే 5జీ స్పెక్ట్రమ్ వేలం.. లక్ష కోట్లకుపైగా ఆదాయంపై అంచనా

ఈ కారణంగానే బాధితులు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ మద్యం సేవించిన వారిలో ఇప్పటివరకు దాదాపు 25 మంది మరణించినట్లు సమాచారం. మరో 40 మంది వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కల్తీ మద్యం తయారీదారులైన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ చేపట్టేందుకు అధికారులు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.