Husband Harassed Wife : పొట్టి దుస్తులు వేసుకో… ఫోటోలు తీస్తా… భర్త వింత కోరికతో విసుగెత్తిన భార్య….

భార్యను వింతవింత దుస్తుల్లో చూడాలనుకున్న భర్త ... పొట్టి దుస్తులు వేసుకుని తన ముందు తిరగాలని ఆదేశించాడు. మరోవైపు అత్తమామల సూటి పోటి మాటలు..

Husband Harassed Wife : పొట్టి దుస్తులు వేసుకో… ఫోటోలు తీస్తా… భర్త వింత కోరికతో విసుగెత్తిన భార్య….

Harassment

Husband Harassed Wife : భార్యను వింతవింత దుస్తుల్లో చూడాలనుకున్న భర్త … పొట్టి దుస్తులు వేసుకుని తన ముందు తిరగాలని ఆదేశించాడు. మరోవైపు అత్తమామల సూటి పోటి మాటలు.. విసిగెత్తిన కొత్త కోడలు ఇంట్లోంచి బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11 లో నివాసం ఉండే యువతి ఎంబీఏ చదివింది. ఫ్యాషన్ డిజైనింగ్ పై ఆసక్తి ఉండటంతో ఆ కోర్సులో చేరింది. ఆ సమయంలో ఆమెకు సికింద్రాబాద్ గన్‌రాక్ ఎన్‌క్లేవ్ లో నివాసం ఉఁడే మహ్మద్ ఫర్హాన్ (26) పరిచయం అయ్యాడు. ఇరు కుటుంబాల సమమ్మతితో వివాహాం చేసుకున్నారు. వివాహా సమయంలో యువతి తల్లితండ్రులు కోటిన్నర విలువైన ఆభరణాలు,వస్త్రాలు, ఇతర సామాగ్రితో పాటు అల్లుడికి ఖరీదైన బహుమతులు అందచేశారు.

పెళ్లి అయిన తర్వాత అత్తవారింటికి చేరుకున్న ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. చదువు మానేసి ఇంట్లోనే ఉండాలని అత్తమామలు ఒత్తిడి చేసి చదువు మాన్పించారు. భర్త వింత వింత కోరికలు కోరటం మొదలెట్టాడు. చిన్నచిన్న, పొట్టి దుస్తులు, లో దుస్తులు వేసుకుని తన ముందు నడవాలని కోరటం మొదలెట్టాడు. అలా నడుస్తుండగా ఆమెను ఫోటోలు , వీడియోలు తీయటం మొదలెట్టాడు. భర్త ప్రవర్తనపై భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తాను చెప్పినట్లు వినికపోతే తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించటం మొదలెట్టాడు.

పెళ్లి సమయంలో పుట్టింటివారు పెట్టిన ఖరీదైన ఆభరణాలు మొత్తం అత్త అయేషా ఉస్మాన్‌ తన వద్ద పెట్టుకున్నది. ఎప్పుడు అడిగినా లాకర్లో ఉన్నాయని, ఖరీదైన ఆభరణాలు వేసుకుని జనం దృష్టిలో పడవద్దంటూ చెప్పేది. ఈలోగా రెండేళ్లు గడిచిపోయింది. రెండేళ్లయినా పిల్లలు పుట్టక పోవటంతో అత్త కోడల్ని సూటిపోటి మాటలతో వేధింపులకు గురిచేసింది. అత్తారింట్లో భర్త ప్రవర్తన అత్తవేధింపులు భరించలేని కోడలు ఆగస్ట్ 8న ఇంట్లోంచి వెళ్లి పోయేందుకు సిద్ధపడింది.

తన సామాన్లు సర్దుకునేందుకు ప్రయత్నిస్తుండగా, అవి కనిపించలేదు. రూ.1.8లక్షల నగదుతో పాటు రూ.కోటిన్నర విలువైన ఆభరణాలు, దుస్తులు, ఇతర బహుమతులను ఇవ్వకపోగా బయటకు గెంటేశారు. దీంతో ఆమె బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితులు ఫర్హాన్‌, అతడి తల్లి అయేషా ఉస్మాన్‌, మామ ఉస్మాన్‌పై గృహహింసతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.