Love Jihad : మతం దాచి పెట్టి పెళ్లి చేసుకున్న భర్తపై లవ్ జిహాద్ కేసు పెట్టిన భార్య

మతం దాచిపెట్టి తప్పుడు సమాచారం ఇచ్చి పెళ్లి చేసుకుని...రెండేళ్ల తర్వాత మతం మారమని బలవంతం చేస్తున్న భర్త ఆమె కుటుంబ  సభ్యులపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Love Jihad : మతం దాచి పెట్టి పెళ్లి చేసుకున్న భర్తపై లవ్ జిహాద్ కేసు పెట్టిన భార్య

Love Jihad Uttar Pradesh

Love Jihad : మతం దాచిపెట్టి తప్పుడు సమాచారం ఇచ్చి పెళ్లి చేసుకుని…రెండేళ్ల తర్వాత మతం మారమని బలవంతం చేస్తున్న భర్త, ఆమె కుటుంబ  సభ్యులపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

చత్తీస్ ఘడ్ లోని రన్వాహైదా గమారియా గ్రామానికి చెందిన పూజా సోని అనే యువతి కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో ఉద్యోగం చేసేది.  అక్కడ ఆమెకు అశోక్ రాజ్ పుత్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అది వాళ్లిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది.

2019 మార్చిలో  ప్రేమికులిద్దరూ ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. 2021 ఫిబ్రవరి7 న  ఈ దంపతులకు ఒక పాప పుట్టింది. అనంతరం రాజ్ పుత్ భార్య పిల్లను, ఉత్తర ప్రదేశ్ లోని  అలీగఢ్  దగ్గర ఉన్న తన స్వగ్రామం రైట్ కు తీసుకు వెళ్ళాడు.

అత్త,మామల ఇంటికి వెళ్లిన పూజా సోని షాక్ కు గురైంది. తన భర్త కుటుంబం ముస్లిం కుటుంబం.  ఈ విషయాన్ని దాచి పెట్టి భర్త ఆమెను పెళ్లి చేసుకున్నాడు.  భర్త ఒరిజినల్ పేరు అఫ్జల్ ఖాన్ అని తెలుసుకుంది.

అక్కడకు వెళ్లినప్పటి నుంచి  వారు ఆమెను నమాజ్ చేయమని బలవంతం చేయసాగారు.  ఆమెకు అది ఇష్టంలేక నమాజ్ చేయలేదు. దీంతో వారు ఆమెను మానసికంగా హింసించసాగారు.

ఏప్రిల్ 8వ తేదీన వారు ఆమెకు బిడ్డను దూరం చేశారు. పూజాకు మతం మార్చి ఆమెపేరు ఆల్నాగా పెట్టారు. మతం మారటం ఇష్టం లేని పూజా సోనీ అలీగఢ్ లోని లోధా పోలీసు స్టేషన్ లో భర్త, ఇద్దరు ఆడపడుచులపై కేసు నమోదు చేసింది.

తనభర్త అబధ్ధం చెప్పి తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని… ఆడపడుచులు ఇప్పడు తనను మతం మారమని బలవంతం చేస్తున్నారని ముగ్గురిపై ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు  ఐపీసీ సెక్షన్ 323 , మరియు ఉత్తరప్రదేశ్ చట్ట విరుధ్ధ బలవంతపు మతమార్పిడి ఆర్డినెన్స్  కింద కేసులు నమోదు చేశారు. భర్త అఫ్జల్ ఖాన్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.