Love Affair : ఫోన్ కాల్ తెచ్చిన తంటా… అనుమానంతో ప్రియురాలు హత్య

ప్రియురాలి పై అనుమానంతో ఓక యువుకుడు ఆమెను హత్య చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. యూపీలోని ఘజియాబాద్ కుచెందిన శివమ్ చౌహాన్(28) ఢిల్లీ, కిషన్ ఘఢ్ లోని వసంత్ కుంజ్ కు చెందిన యువతితో

Love Affair : ఫోన్ కాల్ తెచ్చిన తంటా… అనుమానంతో ప్రియురాలు హత్య

arrested

Love Affair : ప్రియురాలి పై అనుమానంతో ఓక యువుకుడు ఆమెను హత్య చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. యూపీలోని ఘజియాబాద్ కుచెందిన శివమ్ చౌహాన్(28) ఢిల్లీ, కిషన్ ఘఢ్ లోని వసంత్ కుంజ్ కు చెందిన యువతితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు.

వీళ్లిద్దరూ ఏకాంతంగా ఉండేందుకు ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఒక హోటల్ కు ఫిబ్రవరి 25 శుక్రవారం వచ్చారు. వారిద్దరూ ఏకాంతంగా ఉండగా ఆమెకు ఒక ఫోన్ వచ్చింది. ఎవరు పోన్ చేశారు అని అడిగాడు శివమ్. మా చెల్లెలు ప్రియుడు అని చెప్పింది. ఆమె మాటలు నమ్మని శివమ్ మళ్లీ ప్రశ్నించాడు.

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో ఆవేశంతో శివమ్ ఆమె తలను నేలకేసికొట్టాడు… ఆ దెబ్బలకు  ఆమె అక్కడి కక్కడే చనిపోయింది. మర్నాడు ఉదయం శివమ్ ఒక్కడే రూమ్ లోంచి బయటకు వెళ్ళిపోయాడు. అనంతరం రూమ్ లో మహిళ శవాన్ని గుర్తించిన హోటల్ సిబ్బంది.. పోలీసులకు సమచారం అందించారు.
Also Read : Road Accident : కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం-నలుగురి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు  నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శివమ్ చౌహాన్ ను ఉత్తర ప్రదేశ్ లోని మత్రౌలీలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ డిప్యూటీకమీషనర్ ఆఫ్ పోలీసు(నైరుతి) గౌరవ్ శర్మ తెలిపారు. అనంతరం నిందితుడిని పోలీసులు విచారించగా…తన ప్రియురాలు తనను మోసం చేసిందని… ఆమె ఉత్కర్ష్ అనే మరోక వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్లు చెప్పాడు. అందుకే తాను ఆమెను హత్యచేసినట్లు పోలీసులకుతెలిపాడు.