Suicide Attempt : ప్రాణం మీదకు తెచ్చిన పెద్దమనుషుల పంచాయతీ తీర్పు

గ్రామంలో జరిగిన పెద్దమనుషుల పంచాయితీ తీర్పు ఒకరి ప్రాణం మీదికి తెచ్చింది. భూమి కొనుగోలు విషయమై తమ ప్రమేయం లేకున్నా పెద్దమనుషులు జరిమానా విధించారని మనస్థాపంతో ఓ మహిళ పురుగుల మందు తా

Suicide Attempt : ప్రాణం మీదకు తెచ్చిన పెద్దమనుషుల పంచాయతీ తీర్పు

married woman suicide attempt

Suicide Attempt :  గ్రామంలో జరిగిన పెద్దమనుషుల పంచాయితీ తీర్పు ఒకరి ప్రాణం మీదికి తెచ్చింది. భూమి కొనుగోలు విషయమై తమ ప్రమేయం లేకున్నా పెద్దమనుషులు జరిమానా విధించారని మనస్థాపంతో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగాం జిల్లా పాలకుర్తి మండలంలో చోటు చేసుకుంది

పాలకుర్తి మండలం లక్ష్మీ నారాయణ పురం గ్రామానికి చెందిన మజ్జిక వీరాస్వామి అనే వ్యక్తి తన 17 కుంటల భూమిని గ్రామానికి చెందిన బద్రి అనే వ్యక్తికి విక్రయించాడు. వీరాస్వామికి డబ్బులు ఇవ్వకుండానే భూమిని బద్రి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అదే భూమిని బద్రి గ్రామానికి చెందిన మజ్జిక మల్లయ్య అనే వ్యక్తికి తిరిగి విక్రయించాడు. విషయం తెలుసుకున్న వీరాస్వామి మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు.
Also Read : Jabardasth Anchor Anasuya : జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం
గ్రామంలో కొంత మంది పెద్దలు..వీరాస్వామి శవం వుండగానే పంచాయతీ పెట్టారు. వీరాస్వామిని మోసం చేసి అక్రమంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని..ఆ భూమి వీరాస్వామికే చెందాలని తీర్పునిచ్చారు. అంతే కాకుండా వీరాస్వామి మృతికి మల్లయ్య, బద్రిలే కారణమని తీర్పు ఇచ్చారు. ఇందుకుగాను మల్లయ్య కు రూ.7.50 లక్షలు, బద్రికి రూ.2.50 లక్షల జరిమానా విధించారు.

ఈ తీర్పుతో తీవ్రమనస్తాపం చెందిన మల్లయ్య భార్య పద్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పాలకుర్తి మండల కేంద్రంలోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.