Maharashtra: బాలికపై పన్నెండు గంటలపాటు సామూహిక అత్యాచారం.. 8 మంది నిందితులు అరెస్ట్

మహారాష్ట్రలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను ఎత్తుకెళ్లిన ఎనిమిది మంది వ్యక్తులు పన్నెండు గంటలపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Maharashtra: బాలికపై పన్నెండు గంటలపాటు సామూహిక అత్యాచారం.. 8 మంది నిందితులు అరెస్ట్

Maharashtra: మహారాష్ట్రలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై నిందితులు పన్నెండు గంటలపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్ర, పాల్ఘర్ జిల్లాలోని మహిమ్ గ్రామ పరిధిలో జరిగింది. డిసెంబర్ 16, శుక్రవారం రాత్రి బాలికను ఎనిమిది మంది వ్యక్తులు తీసుకెళ్లారు. బీచ్ వద్ద ఉన్న ఒక ఖాళీ బంగ్లాలోకి రాత్రి ఎనిమిది గంటలకు ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

Sachin Tendulkar: సచిన్.. సచిన్.. సచిన్.. విమానంలో హోరెత్తిన ఫ్యాన్స్ నినాదాలు.. ఎందుకంటే

అనంతరం అర్ధరాత్రి ఆ బంగ్లా నుంచి బీచ్‌కు లాక్కెళ్లారు. అక్కడి పొదల్లో తిరిగి అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం పది గంటల వరకు సామూహికంగా ఈ దారుణానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను వదిలేశారు. దీంతో అక్కడ్నుంచి బయటపడ్డ బాలిక శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు 8 మంది నిందితుల్ని ఆదివారం అరెస్టు చేశారు. నిందితులపై పోక్సోతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.