బాలిక శవాన్ని రేప్ చేసేందుకు సమాధి తవ్విన 51ఏళ్ల కామాంధుడు

  • Published By: madhu ,Published On : May 21, 2020 / 08:35 AM IST
బాలిక శవాన్ని రేప్ చేసేందుకు సమాధి తవ్విన 51ఏళ్ల కామాంధుడు

కామాంధుడి దాహానికి స్మశానంలో శవానికి కూడా రక్షణ లేకుండాపోయింది. నేర చరిత్ర ఉన్న ఓ వ్యక్తి కరోనా సాకుతో బయటకు వచ్చి సమాధిలో ఉన్న బాలిక శవంపై అత్యాచారం చేయబోయాడు. ఈ ఆరోపణలపై అస్సాం పోలీసులు 51ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. 

ధేమాజీ జిల్లాలో 2020, మే 17వ తేదీ బాలిక అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. కుటుంబసభ్యులు అదే రోజు రాత్రి మృతదేహాన్ని సిమెన్ నది సమీపంలో ఖననం చేశారు. మే 18వ తేదీ ఆఖాఖాన్ (51) సమాధిని తవ్వి బాలిక మృతదేహంపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. కొంతమంది మత్స్యకారులు అది గమనించి సమాచారం అందించారని ధెమాజీ పోలీసు సూపరింటెండెంట్ ధనంజయ్ ఘనావత్ వెల్లడించారు.

అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని, నిందితుడు సైకో ప్రవర్తనతో ఉన్నాడని అన్నారు. గతంలో ఆ వ్యక్తికి రెండుసార్లు వివాహం జరగ్గా..2018లో గృహ హింస చట్టం కింద అరెస్టు అయ్యాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల ప్రకారం.. కొంతమంది ఖైదీలను విడుదల చేశారు. ఈ క్రమంలోనే కరోనా సాకుతో మార్చి నెలాఖరులో ఆఖాఖాన్ పెరోల్ పై విడుదలయ్యాడు.

అదే వ్యక్తి లైంగికంగా వేధించడంతో బాలిక ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన నివేదిక రావాల్సి ఉంది. నిందితుడిపై విచారణ చేపట్టారు. దీంతో ఐపీసీ 306, 307 సెక్షన్ల కింద ఆత్మహత్యాయత్నం, లైంగిక చర్యలకు పాల్పడినందుకు..ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.