భార్య, అత్తను చంపి ఆపై తాను ఆత్మహత్య 

  • Published By: bheemraj ,Published On : June 24, 2020 / 06:01 PM IST
భార్య, అత్తను చంపి ఆపై తాను ఆత్మహత్య 

భార్యను, అత్తను అంతమొందించి తదననంతరం ఆత్మహత్య చేసుకున్న బెంగుళూరుకు చెందిన చార్టడ్‌ అకౌంటెంట్‌ అమిత్‌ అగర్వాల్‌ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమిత్‌ చనిపోయిన ప్రదేశంలో 67 పేజీల సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో తన  భార్యను చంపడానికి ఆరు నెలలుగా అమిత్‌ రకరకాలుగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. 

పాముతో కాటు వేయించడానికి ప్రయత్నించినట్లు, కారు యాక్సిడెంట్‌ చేయించాలనుకున్నట్లు, సుపారీ ఇచ్చి బిహార్‌ రౌడీలతో చంపించడానికి ప్రయత్నించినట్లు ఆ సూసైడ్‌ నోట్‌లో అమిత్‌ రాశాడు. చివరికి ఇవేమి కాదని తానే భార్యను స్వయంగా హత్య చేయడానికి నిర్ణయించుకున్నట్లు అమిత్‌ సూసైడ్‌ నోట్‌లో రాశాడు. తరచూ భార్యతో గొడవలు జరుగడంతో భార్యతో విడాకులు తీసుకోవాలని అమిత్‌ నిర్ణయించుకున్నాడు. 

గొడవలను మనసులో పెట్టుకున్న అమిత్‌ భార్య శిల్పి ధంధానియాను చంపాడు. అనంతరం అతని అత్తమామల ఇంటికి వెళ్లి అత్తతో గొడవ పడి ఆమెను కూడా చంపాడు. మామ తప్పించుకొని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చేసరికి అమిత్‌ కూడా  తనని తాను కాల్చుకొని చనిపోయాడు.