Rape On Girl : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు..కీలకంగా మారిన ఇన్నోవా కారు ఆచూకీ లభ్యం
కేసులో కీలకంగా మారిన ఇన్నోవా కారు.. గవర్నమెంట్ వెహికల్గా టెంపరరీ రిజిస్ట్రేషన్ జరిగిందని పోలీసులు గుర్తించారు. నెంబర్ ప్లేట్ లేకుండానే ఆ కారు హైదరాబాద్లో తిరిగింది. వక్ఫ్ బోర్డు ఛైర్మనే.. ఆ కారు వాడుతున్నట్లు గుర్తించారు.

Innova Car (1)
girl gang-rape case : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఎంతో కీలకంగా మారిన ఇన్నోవా కారు ఆచూకీ లభ్యం అయింది. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు కారును గుర్తించారు. క్లూస్ టీం నిపుణులతో.. కారులో ఉన్న ఆధారాలను సేకరించారు. పోలీసులు ఇన్నోవా కార్ ను సీజ్ చేశారు. మోయిన బాద్ లో ఇన్నోవా కార్ ను గుర్తించిన పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇన్నోవా కార్ లోనే బాలికపై ఐదుగురు అత్యాచారానికి ఒడిగట్టారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్, మెడికల్ ఎగ్జామినేషన్ను పూర్తి చేసిన పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపారు. ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టే ఇప్పుడు కీలకం కాబోతోంది. దానిని బట్టే.. అసలు దోషులు ఎవరన్నది తేలుతుంది.
ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగానే న్యాయస్థానం నిందితులకు శిక్షలు ఖరారు చేస్తుంది. ఇన్నోవా కారులోనే.. గ్యాంగ్ రేప్ జరిగిందని పోలీసులు చెప్పారు. అదే నిజమైతే.. ఇప్పుడు క్లూస్ టీం సేకరించిన ఆధారాలతో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో అసలు విషయం తేలిపోతుంది. కేసులో కీలకంగా మారిన ఇన్నోవా కారు.. గవర్నమెంట్ వెహికల్గా టెంపరరీ రిజిస్ట్రేషన్ జరిగిందని పోలీసులు గుర్తించారు. నెంబర్ ప్లేట్ లేకుండానే ఆ కారు హైదరాబాద్లో తిరిగింది. వక్ఫ్ బోర్డు ఛైర్మనే.. ఆ కారు వాడుతున్నట్లు గుర్తించారు. ఆయన కుమారుడే ఇన్నోవాను తీసుకొచ్చాడని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. విచారణలో భాగంగా అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.
Rape On Girl : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్
జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు… మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. తప్పించుకున్న వారిలో ఓ మేజర్, మరో మైనర్ ఉన్నారు. బాలికపై అత్యాచారం చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అంది ఐదు రోజులైనా నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఇప్పటివరకు అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఏ-2 సాదుద్దీన్ మాలిక్తో పాటు మరో ఇద్దరు మైనర్లను రిమాండ్కు పంపారు. ఇద్దరు మైనర్లను జువైనల్ హోంకు తరలించారు.
జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. మే 28న పబ్లో ఇంటర్ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ జరిగినట్లుగా పోలీసులు తేల్చారు. మే 28న అమ్నేషియా పబ్లో ఓ కార్పొరేట్ విద్యా సంస్థకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ జరిగింది. విద్యాసంస్థ లెటర్ హెడ్తో అమ్నేషియా పబ్లో పార్టీ కోసం ఆసిఫ్ అనే వ్యక్తి అనుమతి తీసుకున్నాడు. నిషాన్, ఆదిత్య, ఇషాన్, ఆసిఫ్ పార్టీకి బుక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పార్టీ కోసం పబ్కు 2 లక్షల రూపాయలు చెల్లించినట్లు విచారణలో తేలింది. అయితే పబ్లో 150 మంది విద్యార్థులు వితౌట్ ఆల్కహాల్, నాన్ స్మోకింగ్ పార్టీ చేసుకున్నట్లు సీసీకెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు.