కాంగ్రెస్ నేత బంధువు ఇంట్లో భారీ చోరీ : రూ.4కోట్ల విలువైన వజ్రాలు అపహరణ

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి అన్న కొడుకు ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో దొంగలుపడ్డారు. రూ.4 కోట్ల విలువైన

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 09:28 AM IST
కాంగ్రెస్ నేత బంధువు ఇంట్లో భారీ చోరీ : రూ.4కోట్ల విలువైన వజ్రాలు అపహరణ

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి అన్న కొడుకు ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో దొంగలుపడ్డారు. రూ.4 కోట్ల విలువైన

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి అన్న కొడుకు ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో దొంగలుపడ్డారు. రూ.4 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, నగదు  ఎత్తుకెళ్లారు. మంగళవారం(ఆగస్టు 27,2019) తెల్లవారుజామున దొంగతనం జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తమ్ రెడ్డి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో ప్లాట్ నెంబర్ 91లో నివాసం ఉంటున్నారు. ఉత్తమ్ రెడ్డి ఇంట్లో ఆరుగురు కుటుంబసభ్యులు ఉంటారు.

మంగళవారం ఉదయం ఉత్తమ్‌రెడ్డి కుటుంబసభ్యులు బెడ్ రూమ్ లోకి వెళ్లారు. అక్కడ జరిగింది చూసి షాక్ తిన్నారు. బెడ్ రూమ్ లో ఉంచిన విలువైన వజ్రాల  నగలు, బంగారం, నగదు మాయమైనట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

చోరీకి గురైన వాటిలో రూ.3 కోట్ల విలువైన వజ్రాల నగలు, బంగారం ఉన్నట్టుగా తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు  ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీం రంగంలోకి దిగాయి. ఆధారాలు సేకరిస్తున్నారు. కాలనీ పరిసర ప్రాంతాల్లోనీ సీసీ టీవీ ఫుటేజ్‌ను సేకరించి విచారణ చేపట్టారు. హై సెక్యూరిటీ జోన్‌లో ఉన్న  ఇంట్లో భారీ చోరీ జరగడం కలకలం రేపింది. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రత పెంచాలని కోరారు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు దొంగ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఇంట్లోకి ప్రవేశించిన దొంగ భవనంలోని ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్లాడు. 2 గంటల పాటు అక్కడే ఉన్నాడు. బెడ్ రూమ్ లో ఉంచిన వజ్రాలు, గోల్డ్ ఎత్తుకెళ్లాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. సెన్సార్ సెక్యూరిటీ  సిస్టమ్ ఆఫ్ చెయ్యడంతోనే దొంగ ఇంట్లోకి ప్రవేశించగలిగాడని పోలీసులు గుర్తించారు. ఉత్తమ్ రెడ్డి కుటుంబసభ్యులను, పని మనుషులు, సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Also Read : ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ వరాలు