Mumbai Incident : తల్లిని చంపి ముక్కలుగా చేసి 2నెలలు ఇంట్లోనే ఉంచిన కూతురు, దుర్వాసన రాకుండా 200రకాల పర్‌ఫ్యూమ్స్ వాడకం

కన్నకూతురే తల్లిని చంపి డెడ్ బాడీని ముక్కలు చేసింది. అంతేకాదు మృతదేహాన్ని రెండు నెలల పాటు ఇంట్లోనే ఉంచుకుంది. ఆపై.. దుర్వాసన రాకుండా 200 రకాల పర్ ఫ్యూమ్స్ వాడటం మరింత షాక్ కి గురి చేస్తోంది.

Mumbai Incident : తల్లిని చంపి ముక్కలుగా చేసి 2నెలలు ఇంట్లోనే ఉంచిన కూతురు, దుర్వాసన రాకుండా 200రకాల పర్‌ఫ్యూమ్స్ వాడకం

Mumbai Incident : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ శ్రద్ధా వాకర్ తరహా ఘటన ముంబైలో చోటు చేసుకుంది. శ్రద్ధాను అతడి బాయ్ ఫ్రెండ్ చంపి, మృతదేహాన్ని ముక్కలు చేయగా.. ఇక్కడ కన్నకూతురే తల్లిని చంపి డెడ్ బాడీని ముక్కలు చేసింది. అంతేకాదు మృతదేహాన్ని రెండు నెలల పాటు ఇంట్లోనే ఉంచుకుంది. ఆపై.. దుర్వాసన రాకుండా 200 రకాల పర్ ఫ్యూమ్స్ వాడటం మరింత షాక్ కి గురి చేస్తోంది.

ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ముంబైలో వెలుగుచూసింది. ముంబైలోని లాల్ బాగ్ ప్రాంతంలో తల్లికూతురు నివాసం ఉండేవారు. ఏం జరిగిందో కానీ, 21 ఏళ్ల కూతురు రింపుల్ జైన్.. కన్నతల్లిని చంపేసింది. ఆ తర్వాత ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు.. మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో కుక్కింది.

Also Read..New Delhi: బ్యాగులో మహిళ పుర్రె, శరీర భాగాలు లభ్యం.. మహిళను హత్య చేసి పడేశారా?

తల, మొండెం బీరువాలో.. కాళ్లు, చేతులు స్టీల్ వాటర్ క్యాన్ లో దాచింది. అలా రెండున్నర నెలలపాటు శవాన్ని ఇంట్లోనే ఉంచింది. దుర్వాసన రాకుండా ఉండేందుకు ఆమె అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంది. ఇందుకోసం 200 రకాల పర్ ఫ్యూమ్స్ వాడింది. చివరికి.. మార్చి 14న తన సోదరి కనిపించడం లేదని మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు జైన్ ను అరెస్ట్ చేశారు.

Also Read..US : ఓ మహిళను చంపి,గుండె తీసి కూర వండిన కిరాతకుడు .. ఐదు జీవిత ఖైదు శిక్షలు విధించిన కోర్టు

రంగంలోకి దిగిన పోలీసులు తల్లీకూతురు నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి వెతికారు. అక్కడ వారికి ఓ బ్యాగ్ కనిపించగా.. దాన్ని ఓపెన్ చేసి చూసి నిర్ఘాంతపోయారు. కుళ్లిపోయి, భరించలేని వాసనతో మృతదేహం భాగాలు కనిపించాయి. పోలీసులు వెంటనే కూతురిని అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు.

అసలు తల్లిని ఎందుకు చంపింది? మృతదేహాన్ని నెలల తరబడి ఇంట్లోనే ఎందుకు దాచింది? ఈ ప్రశ్నలకు క్లారిటీ రావాల్సి ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధవాకర్ హత్యోదంతం తీవ్ర సంచలనం రేపింది. ఆ తర్వాత అలాంటి హత్యల ఘటనలు దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో వరుసగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. హత్య చేయడమే కాకుండా మృతదేహాన్ని ముక్కలుగా చేయడం.. మనుషుల్లో ఈ విపరీత ప్రవర్తన.. ఆందోళనకు గురి చేసే అంశం.