సాఫ్ట్వేర్ ఉద్యోగి హత్యకేసులో ముందడుగు : పోలీసులకు చిక్కిన హేమంత్!
హైదరాబాద్ కేపీహెచ్బీలో జరిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సతీశ్ హత్యకేసు దర్యాప్తులో పోలీసులు ముందడుగు వేశారు. పరారీలో ఉన్న హేమంత్ను గుల్బర్గ దగ్గర అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ కేపీహెచ్బీలో జరిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సతీశ్ హత్యకేసు దర్యాప్తులో పోలీసులు ముందడుగు వేశారు. పరారీలో ఉన్న హేమంత్ను గుల్బర్గ దగ్గర అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ కేపీహెచ్బీలో జరిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సతీశ్ హత్యకేసు దర్యాప్తులో పోలీసులు ముందడుగు వేశారు. పరారీలో ఉన్న హేమంత్ను గుల్బర్గ దగ్గర అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హేమంత్ను రహస్యంగా విచారిస్తున్న పోలీసులు… ప్రియాంక పాత్రపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. సతీశ్ హత్యకు ఆర్థిక లావాదేవీలే కాకుండా… ప్రియాంక వ్యవహారమూ కారణమని అనుమానిస్తున్న పోలీసులు… హత్య జరిగినపుడు ప్రియాంక అక్కడే ఉందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రియాంక, హేమంత్ మధ్య వివాహేతర సంబంధమున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు… కొంతకాలంగా సతీశ్తో ప్రియాంక చనువుగా ఉండటమే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు.. సతీశ్ హత్యకు ముందు ఏం జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం
మృతుడు సతీష్, హేమంత్ ఇద్దరూ ఫ్రెండ్స్. అమ్మాయి విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆగస్టు 27న రాత్రి సతీష్ ను హేమంత్ మర్డర్ చేశాడు. 28న తన భర్త కనిపించడం లేదని సతీష్ భార్య ప్రశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 29న రాత్రి హేమంత్ ఇంట్లో సతీష్ మృతదేహం లభ్యమైంది. హత్య తర్వాత హేమంత్ తనకు ఏమీ తెలియనట్టు యాక్ట్ చేశాడు. సతీష్ భార్య ప్రశాంతి, స్నేహితులతో కలిసి ఉన్నాడు. సతీష్ కోసం వెతుకున్నట్టు నటించాడు. సతీష్ భార్య ప్రశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే హేమంత్ పారిపోయాడు.
ఈ మొత్తం వ్యవహారంలో ప్రియాంక అనే అమ్మాయి కీలకంగా మారింది. ప్రియాంక వల్లే ఫ్రెండ్స్ మధ్య గొడవలు జరిగాయి. సతీష్ ద్వారా ప్రియాంక హేమంత్ కు పరిచయమైంది. ప్రియాంకకు తన కంపెనీలో సతీష్ ఉద్యోగం ఇచ్చాడు. కొద్దిరోజులుగా హేమంత్ తో ప్రియాంక సహజీవనం చేస్తోందని పోలీసులు చెప్పారు. గతంలో సతీష్ తో చనువుగా ఉన్న ప్రియాంక ఇప్పుడు హేమంత్ కి దగ్గరైంది. ఈ విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రియాంక తనకు దూరం కావడాన్ని హేమంత్ తట్టుకోలేకపోయాడు. సతీష్ ని ఇంటికి పిలిపించి మరీ మర్డర్ చేశాడు. కూకట్పల్లి కేపీహెచ్బీ 7వ ఫేజ్లో చిన్ననాటి స్నేహితుడిని అతి కిరాతకంగా హతమార్చిన ఘటన కలకలం రేపింది.
Also Read : ఆర్టికల్ 370 ని రద్దు చేస్తే పాకిస్తాన్ కు ఎందుకు బాధ : కిషన్ రెడ్డి