కాపురానికి పంపండి…మెడలో బాంబులతో భయపెట్టిన భర్త

  • Published By: venkaiahnaidu ,Published On : September 23, 2019 / 02:04 PM IST
కాపురానికి పంపండి…మెడలో బాంబులతో భయపెట్టిన భర్త

భార్యను కాపురానికి పంపాలని ఓ భర్త మెడలో నాటు బాంబులు వేసుకుని అత్తమామలను భయపెట్టిన ఘటన తమిళనాడులో జరిగింది.  జరిగింది. భార్యను కాపురానికి పంపకపోతే మెడలో వేసుకున్న బాంబులు పేల్చుసుకుంటాను.. శరీరంపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంటానని అత్తమామలను బెదిరించాడు.

మణికందన్‌ అనే వ్యక్తి.. తన భార్యకు ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నాడు. భర్త నుంచి తనకు విడాకులు కావాలని భార్య దరఖాస్తు చేసుకుంది. విడాకుల కేసు ఫ్యామిలీ కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే ఒంటరి జీవితం భరించలేని మణికందన్‌.. తన భార్యను కాపురానికి పంపాలని కోరుతూ ఆదివారం(సెప్టెంబర్-22,2019)కడలూరులోని అత్తమామల ఇంటికి ఆదివారం వచ్చాడు. తన భార్యను కాపురానికి పంపించకపోతే నాటు బాంబులు పేల్చేసుకుంటానని..కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటానని అత్తమామలను బెదిరించాడు. అ

అయితే అటుగా వెళ్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ దృష్టికి ఈ విషయాన్ని స్థానికులు తీసుకెళ్లారు. మణికందన్‌ దగ్గరకు చేరుకున్నహెడ్‌కానిస్టేబుల్‌.. ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పాడు. అంతే కాకుండా మణికందన్‌ రెండేళ్ల కుమారుడిని తీసుకువచ్చి.. పిల్లోడి భవిష్యత్‌ గురించి ఆలోచించాలని హెడ్‌కానిస్టేబుల్‌ సూచించాడు. పిల్లాడి ఏడుపు విన్న మణికందన్‌ కు మనసు కరిగి తన ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అయితే తాను అప్పటికే విషం తాగానని పోలీసులకు చెప్పడంతో అతన్ని హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లారు.