తమిళనాడులో దారుణం : నడిరోడ్డుపై హత్య

తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలిలో దారుణం జరిగింది. నడి రోడ్డుపై హత్య జరిగింది. హత్య దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజీని పోలీసులు రిలీజ్ చేశారు. అందులో

  • Published By: veegamteam ,Published On : May 7, 2019 / 02:37 AM IST
తమిళనాడులో దారుణం : నడిరోడ్డుపై హత్య

తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలిలో దారుణం జరిగింది. నడి రోడ్డుపై హత్య జరిగింది. హత్య దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజీని పోలీసులు రిలీజ్ చేశారు. అందులో

తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలిలో దారుణం జరిగింది. నడి రోడ్డుపై హత్య జరిగింది. హత్య దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజీని పోలీసులు రిలీజ్ చేశారు. అందులో ఇద్దరు వ్యక్తులు.. మరో వ్యక్తిని నరికి చంపారు. కొడవలితో పాశవికంగా దాడి చేశారు. అతడు తప్పించుకునే ప్రయత్నం చేసినా వెంటాడి నరికారు. రోడ్డుపై వాహనాలు వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కళ్ల ముందు దారుణం జరుగుతున్నా.. అడ్డుకునే సాహసం చెయ్యలేకపోయారు.

నడిరోడ్డుపై మర్డర్.. స్థానికంగా సంచలనం చేపింది. స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. తిరునల్వేలిలోని టౌన్ ఆర్చ్ సమీపంలో ఈ మర్డర్ జరిగింది. ఈ కేసులో నిందితులు లొంగిపోయారు. పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు. హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.