New Delhi: ట్యాక్సీ డ్రైవర్ ఘాతుకం.. పెళ్లికి అంగీకరించలేదని వివాహిత హత్య

బిహార్‌కు చెందిన శివ్ శంకర్ ముఖియా ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఇప్పటికే పెళ్లై, నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అతడికి మూడేళ్లక్రితం సునీత అనే మహిళ పరిచయమైంది. ఆమెకు కూడా పెళ్లైంది. కాగా, సునీత సెక్స్ వర్కర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

New Delhi: ట్యాక్సీ డ్రైవర్ ఘాతుకం.. పెళ్లికి అంగీకరించలేదని వివాహిత హత్య

New Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తనతో పెళ్లికి అంగీకరించలేదని ఒక ట్యాక్సీ డ్రైవర్ వివాహితను హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీ, న్యూ అశోక్ నగర్‌లో గత నెల 26న జరిగింది. డీసీపీ అమృత గుగులోత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన శివ్ శంకర్ ముఖియా ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

PM Modi: మోదీ పర్యటనలో భద్రతాలోపం.. కాన్వాయ్‌వైపు దూసుకొచ్చిన వ్యక్తి.. వైరల్ వీడియో

అతడికి ఇప్పటికే పెళ్లై, నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అతడికి మూడేళ్లక్రితం సునీత అనే మహిళ పరిచయమైంది. ఆమెకు కూడా పెళ్లైంది. కాగా, సునీత సెక్స్ వర్కర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శివ్ శంకర్, సునీతల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అప్పుడప్పుడూ సునీతకు అతడు డబ్బులు సాయం చేసేవాడు. కాగా, కొద్ది రోజులుగా సునీతను అతడు వేధించడం మొదలుపెట్టాడు. తన భర్తను వదిలేసి, తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించేవాడు. దీనికి సునీత నిరాకరించింది. తనను పెళ్లి చేసుకునేందుకు సునీత ఒప్పుకోకపోవడంతో శివ్ శంకర్ ఆమెను గత ఫిబ్రవరి 26న హత్య చేశాడు.

Indian Journalist: అమెరికాలో భారతీయ జర్నలిస్టుపై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి

అనంతరం అతడు అక్కడి నుంచి పారిపోయాడు. న్యూ అశోక్ నగర్ పరిధిలో సునీత హత్య గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, విచారణ ప్రారంభించారు. సునీత స్నేహితురాలు, భర్తను విచారించగా ట్యాక్సీ డ్రైవర్‌పై అనుమానం వచ్చింది. ఈ దిశగా.. హత్య జరిగిన రోజునాటి సీసీ కెమెరాల్ని పరిశీలించగా శివ్ శంకర్ తీరు మరింత అనుమానాస్పదంగా అనిపించింది. దీంతో అతడిని పూర్తి స్థాయిలో విచారించగా అసలు విషయం బయటపడింది. కాగా, అతడు సునీత భర్తను కూడా గతంలో బెదిరించినట్లు తెలుస్తోంది. సునీతను వదిలిపెట్టమని అతడు ఆమె భర్తను బెదిరించాడు.