Bengaluru: యూనివర్సిటీలో యువతి హత్య.. పెళ్లికి ఒప్పుకోనందుకు కత్తితో పొడిచి చంపిన యువకుడు

లయ స్మిత అనే 19 ఏళ్ల యువతి కాలేజీలో బీటెక్ చదువుతోంది. పక్కనే ఉన్న కాలేజీలో పవన్ కల్యాణ్ అనే 21 ఏళ్ల యువకుడు బీసీఏ చదువుతున్నాడు. పవన్-లయ స్మిత.. ఇద్దరిదీ ఒకే ఊరు. బంధుత్వం కూడా ఉంది. కొంత కాలం నుంచి పవన్, లయ స్మితను ఇష్టపడుతున్నాడు.

Bengaluru: యూనివర్సిటీలో యువతి హత్య.. పెళ్లికి ఒప్పుకోనందుకు కత్తితో పొడిచి చంపిన యువకుడు

Bengaluru: కర్ణాటక, బెంగళూరులోని ఒక ప్రైవేటు యూనివర్సిటీలో దారుణం జరిగింది. యూనివర్సిటీలో చదువుకుంటున్న ఒక యువతిని, యువకుడు కత్తితో పొడిచి చంపాడు. తర్వాత యువకుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన బెంగళూరు నగర శివారులోని ఒక ప్రైవేటు యూనివర్సిటీకి చెందిన ప్రెసిడెన్సీ కాలేజ్ కారిడార్‌లో సోమవారం జరిగింది.

Gayathri Raghuram: అన్నామలై నాయకత్వంలో మహిళలకు రక్షణ లేదు: తమిళనాడు నేత గాయత్రి రఘురాం

లయ స్మిత అనే 19 ఏళ్ల యువతి కాలేజీలో బీటెక్ చదువుతోంది. పక్కనే ఉన్న కాలేజీలో పవన్ కల్యాణ్ అనే 21 ఏళ్ల యువకుడు బీసీఏ చదువుతున్నాడు. పవన్-లయ స్మిత.. ఇద్దరిదీ ఒకే ఊరు. బంధుత్వం కూడా ఉంది. కొంత కాలం నుంచి పవన్, లయ స్మితను ఇష్టపడుతున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఈ విషయంపై తన కుటుంబ సభ్యులతో, లయ వాళ్ల ఇంట్లో అడిగించాడు. అయితే, దీనికి లయ కుటుంబం ఒప్పుకోలేదు. తన కూతురు గురించి ఆలోచించవద్దని లయ తల్లి పవన్‌ను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో లయపై కక్ష పెంచుకున్న పవన్ ఆమెను చంపేందుకు సిద్ధమయ్యాడు. సోమవారం ఆమె చదువుకుంటున్న కాలేజీకి వెళ్లాడు. అక్కడ లయతో కొద్దిసేపు మాట్లాడాడు.

Delhi Liquor Sale: ఆ వారం రోజుల్లో ఢిల్లీ ప్రజలు ఎన్నికోట్ల మద్యం తాగేశారో తెలుసా? బాబోయ్.. విస్కీ అయితే..

తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పవన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో లయపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె ఛాతిలో పొడిచాడు. వెంటనే లయ అక్కడే రక్తపు మడుగులో కింద పడిపోయింది. తర్వాత పవన్ కూడా అదే కత్తితో తనను తాను పొడుచుకున్నాడు. దీంతో ఇద్దరూ రక్తపు మడుగులో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఇది గమనించిన విద్యార్థులు, కళాశాల యాజమాన్యం వారిని ఆస్పత్రికి తరలించింది. అయితే, అప్పటికే లయ స్మిత మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. పవన్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.