Medak‌ : ఆస్తి కోసం అక్కపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన చెల్లెలు

మెదక్‌ జిల్లాలో ఆస్తి కోసం అక్కపై పెట్రోల్ పోసి నిప్పంటించింది ఓ చెల్లెలు. ఆ తర్వాత ఆమె కూడా మంటల్లో కాలుతున్న అక్కను హత్తుకొని ఆత్మహత్యాయత్నం చేసింది.

Medak‌ : ఆస్తి కోసం అక్కపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన చెల్లెలు

Fire

younger sister poured petrol on elder sister : మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. రోజురోజుకీ కుటుంబ బాంధవ్యాలు దిగజారిపోతున్నాయి. ఆస్తులు అయినవాళ్లనీ దూరం చేస్తున్నాయి. ఒక్క కడుపున పుట్టిన బిడ్డలు కూడా ఆస్తుల కోసం పోట్లాడుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి పెళ్లైన దాకా ఒకే ఇంట్లో పెరిగిన వ్యక్తులు చివరకు ప్రాపర్టీల కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు. రక్త సంబంధాలకంటే ఆస్తులే ఎక్కువని భావిస్తున్నారు. అన్నాదమ్ములు, అక్కా చెల్లెల్లు అని మరిచి వైరం పెంచుకుంటున్నారు.

ఆస్తులు, అంతస్థులే ముఖ్యం అంటూ శత్రుత్వాలను రెట్టింపు చేసుకుంటున్నారు. ప్రతీ ప్రాంతంలో, ప్రతీ చోటా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మెదక్‌ జిల్లాలో ఆస్తి కోసం అక్కపై పెట్రోల్ పోసి నిప్పంటించింది ఓ చెల్లెలు. ఆ తర్వాత ఆమె కూడా మంటల్లో కాలుతున్న అక్కను హత్తుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. చేగుంట మండలం వడియారం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

CM KCR : బీజేపీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు, మత పిచ్చి లేపుడు : సీఎం కేసీఆర్

కామారెడ్డి జిల్లా చిన్న మల్లా రెడ్డికి చెందిన ధర్మగౌని రాజాగౌడ్‌ అనే వ్యక్తికి నలుగురు కూతుర్లు ఉన్నారు. వీరందరికీ గతంలోనే రాజా గౌడ్ పెళ్లిళ్లు చేశాడు. వీరిలో ఒకరైన వరలక్ష్మి వడియారం గ్రామంలోనే ఓ అద్దె ఇంట్లో ఉంటుంది. అయితే, రాజా గౌడ్‌కు ఐదెకరాల భూమి ఉండగా.. అది వారసత్వం కింద నలుగురు కూతుర్లకి చెందుతుంది. ఇలా పుట్టింటికి చెందిన అయిదెకరాల పంపకం విషయంలో అక్కాచెల్లెళ్ల మధ్య కొన్నాళ్లుగా వివాదం జరుగుతూ వస్తోంది.

ఈ క్రమంలోనే సోమవారం వరలక్ష్మి సోదరి రాజేశ్వరి.. వడియారంలోని ఆమె ఇంటికి వచ్చారు. వారిద్దరి మధ్య ఎప్పటిలాగే ఆస్తి విషయంలో వాగ్వాదం చెలరేగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన రాజేశ్వరి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను అక్క వరలక్ష్మిపై పోసి నిప్పంటించింది. మంటలతోనే ఉన్న వరలక్ష్మి వెళ్లి చెల్లెలు రాజేశ్వరిని గట్టిగా పట్టుకుంది. దీంతో ఇద్దరూ గాయపడ్డారు. ఇంట్లోనే ఉన్న వరలక్ష్మి పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పివేశారు.

CM KCR : సోషల్ మీడియా కాదు.. క్షుద్ర విద్య.. విరిచి పొయ్యిలో పెడతాం : సీఎం కేసీఆర్

వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా.. వారు సకాలంలో వచ్చి బాధితులను ఆస్పత్రికి చేర్చారు. తీవ్రంగా గాయపడిన వరలక్ష్మిని హైదరాబాద్‌‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరో ప్రైవేటు అంబులెన్స్‌లో రాజేశ్వరిని తూప్రాన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి ఉస్మానియాకు తీసుకెళ్లారు. ఆస్తి తగాదాల విషయంలో సొంత అక్కా చెల్లెళ్ల మధ్యనే వ్యవహారం ఇలా చంపుకునే ప్రయత్నాల వరకూ వెళ్లడంతో స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.