CM KCR : బీజేపీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు, మత పిచ్చి లేపుడు : సీఎం కేసీఆర్

లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని మోదీని అడుగుతున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ బీమా కంపెనీలకు బ్రోకర్లుగా వ్యవహరిస్తారా అని నిలదీశారు.

CM KCR : బీజేపీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు, మత పిచ్చి లేపుడు : సీఎం కేసీఆర్

Kcr Fire

CM KCR fired BJP : కరోనా టైంలోనూ కేంద్ర ప్రభుత్వం దరిద్రపుగొట్టు నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఏ వర్గానికీ కేటాయింపులు పెంచలేదన్నారు. మరి ఎవరికి పెంచినట్లు ప్రశ్నించారు. బీజేపీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు, మత పిచ్చి లేపుడు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఎయిరిండియాను అమ్మారు…ఇప్పుడు ఎస్ఐసీ వంతు వచ్చిందన్నారు.

లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని మోదీని అడుగుతున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ బీమా కంపెనీలకు బ్రోకర్లుగా వ్యవహరిస్తారా అని నిలదీశారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. కానీ రైతుల పెట్టుబడిని రెట్టింపు చేశారని ఎద్దేవా చేశారు. హౌసింగ్ ఫర్ ఆల్ ఉత్తి బోగస్ అని విమర్శించారు.

CM KCR : సోషల్ మీడియా కాదు.. క్షుద్ర విద్య.. విరిచి పొయ్యిలో పెడతాం : సీఎం కేసీఆర్

ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇస్తామన్నారు.. ఎవరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. గజ దొంగలంతా మీ హయాంలోనే విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. ఈ దరిద్రపు గొట్టు పార్టీని కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో పడేస్తామన్నారు. ఈ దేశం నిద్రాణంగా లేదు.. ఏం చేయాలో అది చేస్తామని చెప్పారు. బీజేపీని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని పిలుపు ఇచ్చారు.

దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అని సీఎం కేసీఆర్ విమర్శించారు. దేశ వాతావరణాన్ని చెడగొడుతుందన్నారు. మీరు మొరిగితే మిమ్మల్ని పిచ్చి కుక్కలు అంటామని తెలిపారు. రాష్ట్రాన్ని చెడగొడతా మంటే ఊరుకోవాలా అని అన్నారు. సోషల్ మీడియా పేరుతో తప్పుడు ప్రచారాలను చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. దళిత బంధు పథకం మీకు కనపడటం లేదా అని నిలదీశారు.

CM KCR : నదుల అనుసంధానం మిలీనియానికే బిగ్ జోక్ : సీఎం కేసీఆర్

దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ కాదా అని అన్నారు. తెలంగాణలో, హైదరాబాద్ లో మంచి ఏకో ఉందని.. ఫలితంగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. మీరు సొల్లు పురాణం సోషల్ మీడియా పేరుతో తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోవాల్నా అని అన్నారు. సోషల్ మీడియా కాదు.. క్షుద్ర విద్య.. విరిచి పొయ్యిలో పెడతామని హెచ్చరించారు.