Theft In Police Officers Apartement : పోలీసాఫీసర్లు ఉండే అపార్ట్మెంట్ లోనే చోరీ
వరంగల్ జిల్లాలో దొంగలు చాలా ధైర్యవంతులులాగా ఉన్నారు. ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు నివాసముండే అపార్ట్మెంట్లోనే తమ చేతివాటం ప్రదర్శించి విలువనై బంగారం ఎత్తుకెళ్లా

Theft In Police Officers Apartement : వరంగల్ జిల్లాలో దొంగలు చాలా ధైర్యవంతులులాగా ఉన్నారు. ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు నివాసముండే అపార్ట్మెంట్లోనే తమ చేతివాటం ప్రదర్శించి విలువనై బంగారం ఎత్తుకెళ్లారు. ధనవంతులు, వ్యాపారస్తులు, ఉద్యోగులుండే ప్రాంతంలో ….చుట్టూ సీసీ కెమెరాలున్నా చాకచక్యంగా దొంగలు లోపలికి చొరబడి బంగారు నగలను మాత్రమే చోరీ చేసి వెండి నగలతోపాటు నగదును చిందరవందరగా పడేసి వెళ్లారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేటలోని 61వ డివిజన్ వడ్డెపల్లి ట్యాంక్బండ్ ప్రాంతంలోని పీజీఆర్ అపార్ట్మెంట్లో జరిగింది.
పీజీఆర్ అపార్ట్ మెంట్లో దాదాపు 60 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరిలో ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు కూడా ఉన్నారు. అపార్ట్ మెంట్ లోని 202 ఫ్లాట్ లో ఉండే నిట్ రిటైర్డ్ ప్రోఫెసర్ ఆర్వీ చలం, 203 లో ఉండే వెలిచర్ల రవికుమార్, 102 ప్లాట్ లో ఉండే మనీష్ కుమార్ ఇళ్లకు తాళాలు వేసి బంధు మిత్రుల ఇళ్ళకు వెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఆదివారం రాత్రి వడ్డెపల్లి రిజర్వాయర్ ట్యాంక్బండ్ పైభాగం నుంచి ఫెన్సింగ్ కట్ చేసి లోపలికి దిగి వాచ్మెన్ గంగారపు కొమురయ్య ఇంటికి బయటి నుంచి గొళ్లెం పెట్టి అపార్ట్మెంట్లోకి ప్రవేశించారు.
Also Read : Wife Kidnapped Her Husband : విడాకులు కోసం ప్రియుడితో కలిసి భర్తను కిడ్నాప్ చేసిన భార్య
మూడు ఫ్లాట్లకు ఉన్న తాళాలను పగులగొట్టి వారి ఇళ్లలోని బీరువాల్లోఉన్న దాదాపు 190 తులాల బంగారు నగలను దొచుకెళ్ళారు. సోమవారంరాత్రి తమ ఇళ్లలో దొంగతనం జరిగినట్లుగా సమాచారం తెలుసుకున్న చలం ఇంటికి వచ్చి చూడగా తమ పక్క ఫ్లాట్లలోనూ దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
- Telangana : హెల్త్ హబ్ గా వరంగల్..పైసా ఖర్చు లేకుండా అందరికి కార్పొరేట్ వైద్యం : మంత్రి ఎర్రబెల్లి
- తెలుగు రాష్ట్రాలకు భారీగా పెట్టుబడులు
- Telangana : విద్యార్థిని కింద పడేసి కాళ్లతో తన్ని.. పిడుగుద్దులు గుప్పించిన డిప్యూటీ వార్డెన్
- తెలంగాణలో మొదలైన టెన్త్ ఎగ్జామ్స్
- Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ BA.5 తొలి కేసు నమోదు..తెలంగాణలో గుర్తింపు
1TS Politics : ‘హాట్ సీటు’ గా మారిన కొత్తగూడెం..నిలిచేదెవరు? గెలిచేదెవరు?
2China-Taiwan Conflict : తైవాన్ను చైనా టార్గెట్ చేయడానికి కారణాలు ఏంటి? తైవాన్ మాదేనని చైనా ఎందుకు చెప్తోంది?
3Bihar CM Nitish: అప్పట్లో మా తరగతిలో ఒక్క అమ్మాయి కూడా లేదు: బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు
4Attack On Couple: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దాడి
5Agent: ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసుకున్న ఏజెంట్
6Amalapuram High Tension : అమలాపురంలో హైటెన్షన్.. కోనసీమ కోసం కదంతొక్కిన ఆందోళనకారులు, పోలీసులపై రాళ్ల దాడి
7Biden Warn to China : తైవాన్ జోలికొస్తే సహించేది లేదంటూ చైనాకు అమెరికా వార్నింగ్..
8Gyanvapi Mosque: జ్ఞానవాపి కేసులో విచారణ వాయిదా.. ఎల్లుండి ముస్లిం పిటిషనర్ల వాదనలకు చాన్స్
9AP Govt: ఉద్యోగ సంఘాలతో ముగిసిన మంత్రుల కమిటీ చర్చలు
10Minister Roja: జగన్ లాంటి సీఎం భూతద్దంలో వెతికినా దేశంలో ఎక్కడా కనిపించడు: మంత్రి రోజా
-
After Exercise : వ్యాయామం తరువాత నిస్సత్తువ తగ్గాలంటే!
-
Uyghurs in China: చైనాలో “ఉయ్ఘర్స్ నిర్బంధ శిబిరాలు”: జింజియాంగ్ ప్రాంతంలో యూఎన్ ప్రతినిధి పర్యటన
-
Diabetes : మధుమేహంతో బాధపడుతున్నారా? భయపడాల్సిన పనిలేదు
-
Major: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న మేజర్
-
Ram Pothineni: కొత్త సినిమా లాంఛ్కు ముహూర్తం పెట్టిన రామ్..?
-
PM Modi in Japan: ప్రపంచానికి దిక్సూచిగా భారత్: క్వాడ్ లీడర్ల ముందు వరుసలో ప్రధాని మోదీ
-
Mushrooms : క్యాన్సర్ ముప్పు తొలగించే పుట్టగొడుగులు!
-
GT vs RR IPL 2022 Qualifier 1 : ఇవాళ క్వాలిఫయర్-1 మ్యాచ్.. వర్షం పడితే.. ఫైనల్ చేరేదెట్టా..! ఏ జట్టుకు ఛాన్స్ ఎక్కువంటే?