టీఎన్ జీవోస్ క్రీడల్లో విషాదం : కబడ్డీ ఆడుతూ ఉద్యోగి మృతి 

నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన టీఎన్ జీవోస్ క్రీడల్లో విషాదం నెలకొంది. కబడ్డీ ఆడుతూ పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి సురేష్ మృతి చెందాడు.

  • Published By: veegamteam ,Published On : February 7, 2020 / 03:27 PM IST
టీఎన్ జీవోస్ క్రీడల్లో విషాదం : కబడ్డీ ఆడుతూ ఉద్యోగి మృతి 

నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన టీఎన్ జీవోస్ క్రీడల్లో విషాదం నెలకొంది. కబడ్డీ ఆడుతూ పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి సురేష్ మృతి చెందాడు.

నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన టీఎన్ జీవోస్ క్రీడల్లో విషాదం నెలకొంది. కబడ్డీ ఆడుతూ పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి సురేష్ మృతి చెందాడు. కబడ్డీ ఆడుతుండగా సురేష్ కు బలమైన గాయం అయింది. చికిత్సం కోసం అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

జిల్లా కలెక్టరేట్ మైదానంలో టీఎన్ జీవోస్ క్రీడలు నిర్వహించింది. క్రీడల్లో భాగంగా కబడ్డీ ఆటను నిర్వహించారు. అయితే కబడ్డీ ఆడుతూ సురేష్ అనే ఉద్యోగి కుప్పకూలిపోయాడు. దీంతో తోటి ఉద్యోగులు వెంటనే చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. 

డిచ్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లిలో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. సురేష్ మృతితో కుటుబం సభ్యులు, బంధువులు, తోటి ఉద్యోగులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.