8ఏళ్ల బాలికపై ఏడుగురు అత్యాచారం.. ఆ ఇద్దరికి కరోనా పాజిటివ్

  • Published By: sreehari ,Published On : August 31, 2020 / 04:56 PM IST
8ఏళ్ల బాలికపై ఏడుగురు అత్యాచారం.. ఆ ఇద్దరికి కరోనా పాజిటివ్

త్రిపురలో ఎనిమిదేళ్ల బాలికపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మూడో తరగతి చదువుతున్నఎనిమిదేళ్ల బాలికను ఆడకుందామని పిలిచారు. వారి మాటలు నమ్మి ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన పశ్చిమ త్రిపుర జిల్లాలోని తబారియాలో జరిగింది. ఈ కేసులో అదే ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు.



బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు జరిగింది చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ లో మొత్తం ఏడుగురు నిందితుల పేర్లను పోలీసులు చేర్చారు.. వారిలో ఆరుగురిని అరెస్ట్ చేయగా.. మరో యువకుడు పరారీ ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.



నిందితులకు కరోనా పరీక్షలు చేయగా.. వారిలో 12ఏళ్ల యువకులకు కరోనా పాజిటివ్ అని తేలింది. వారిద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన నలుగురిని జువైనల్ హోంకు తరలించారు.