అత్యాచారం జరిగిన 27 ఏళ్ల తర్వాత కేసు

అత్యాచారం జరిగిన 27 ఏళ్ల తర్వాత కేసు

Uttar Pradesh : raped 27 years ago, woman files case against Two men after her son asks Father”s Name : 12 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆమెపై అత్యాచారం  జరిగింది. తద్వారా గర్భవతై ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లవాడ్ని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు తన తండ్రి పేరేంటని ఆ 27 ఏళ్ల యువకుడు తల్లిని ప్రశ్నించేసరికి ……ఆమె తనపై అత్యాచారం జరిపిన వారిపై కేసు నమోదుచేసింది. ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

షాజహాన్ పూర్ లో తన అక్క బావతో కలిసి నివసిస్తున్న రోజుల్లో తనకు 12 ఏళ్ల వయసున్నప్పుడు … అదే ప్రాంతంలో నివసించే నాకీ హాసన్ అనే వ్యక్తితనపై అత్యాచారం జరిపాడని తెలిపింది. అనంతరం అతని తమ్ముడు గుడ్డు కూడా తనపై అత్యాచారం చేశాడని… వీరిద్దరూ ఆ తర్వాత పలుమార్లు తనపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కోంది.

అన్నదమ్ములిద్దరూ అత్యాచారం చేయటంతో తాను 13 ఏళ్లకే గర్బం దాల్చానని…1992లో పుట్టిన బిడ్డనే ఇంతకాలం పెంచి పోషించానని ఆమె వివరించింది.
అనంతరం ఆమె బావకు ఉదంపూర్ బదిలీ కావటంతో అక్కడకు మకాం మార్చారు. అనంతరం ఆమె ఖాజీపుర్ కు చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వారి సంసారం 10 ఏళ్లి సాగిన తర్వాత అతనువిడాకులు ఇవ్వటంతో మళ్లీ ఒంటరిదై ఉదంపూర్ చేరుకుంది.

ఇన్నేళ్లు బాలుడుని పెంచుతూ వచ్చింది. ఇటీవల తన కుమారుడు తన తండ్రి ఎవరని అడగటంతో బాధితురాలు సదర్ బజార్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయటానికి వెళ్లింది.కాగా ఈ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయటానికి మొదట పోలీసులు అంగీకరించలేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించటంతో పోలీసులు ఫిర్యాదు స్వీకరించి కేసు రిజిష్టరే చేశారు. ఇప్పుడు ఆమె కుమారుడికిడీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు.