Guntur : గుంటూరులో ప్రేమోన్మాది ఘాతకం- తల్లీ,కూతురుపై బ్లేడ్‌తో దాడి

గుంటూరులో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించటంలేదని ఒకయువతిని ఆమె తల్లిని బ్లేడ్ తో గొంతుకోసాడు. అనంతరం రెండంతస్తుల పైనుంచి కిందకు దూకాడు.

Guntur : గుంటూరులో ప్రేమోన్మాది ఘాతకం- తల్లీ,కూతురుపై బ్లేడ్‌తో దాడి

Gunturu Stabbing

Guntur :  గుంటూరులో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించటంలేదని ఒకయువతిని ఆమె తల్లిని బ్లేడ్ తో గొంతుకోసాడు. అనంతరం రెండంతస్తుల పైనుంచి కిందకు దూకాడు.

వివరాల్లోకి వెళితే….  గుంటూరు కృష్ణనగర్ లో పీఎఫ్ ఆఫీసు సమీపంలోని అపార్ట్ మెంట్ లో నివసించే గీతాసాయి అనే యువతి గతంలో   విశాఖపట్నంలో పని చేసేది.  అక్కడే పని చేస్తన్న ధర్మతేజ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా ఆమెను  ప్రేమించమని వేధిస్తున్నాడు.  అందుకు ఆమె అంగీకరించలేదు.  అతని వేధింపులు భరించలేక ఆమె ఉద్యోగం మానేసి గుంటూరు వచ్చేసింది.

ఈ మధ్యకాలంలో మళ్లీ ధర్మతేజ  గీతాసాయి ని పెళ్లి చేసుకోమని కూడా వేధించసాగాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అతనితో పెళ్లి ఇష్టం లేదని తేల్చి చెప్పారు.  ఈక్రమంలో బుధవారం ఉదయం కృష్ణనగర్ లో ఉంటున్న గీతాసాయి ఇంటికి వచ్చిన ధర్మతేజ  సర్జికల్  బ్లేడ్ తో గీతాసాయి, ఆమె తల్లి పై బ్లేడ్ తో  దాడి చేశాడు.  వారి  గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు.  అనంతరం తన చేతిపై కూడా బ్లేడ్ తో కోసుకున్నాడు.

బాధతో వీళ్లిద్దరు పెట్టిన కేకలకు అక్కడి నుంచి తప్పించుకోవాలని చూశాడు. అదే అపార్ట్ మెంట్ లో రెండో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకాడు. ఈక్రమంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్ధానికులు తల్లి కూతుళ్లును   ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ధర్మతేజను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కాగా….ప్రేమోన్మాది ధర్మతేజను కఠినంగా శిక్షించాలని బాధితురాలు గీతాసాయి సోదరి ప్రియంవద డిమాండ్‌ చేసింది. ప్రేమపేరుతో వేధించే సైకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మతేజ వేధింపులకు అక్క వైజాగ్‌లో ఉద్యోగం మానేసిందని ఆవేదన వ్యక్తం చేసింది ప్రియంవద.  ధర్మతేజ తమ ఇంటికి వచ్చి అక్క గీతాసాయితో పాటు అమ్మపై దాడికి పాల్పడ్డాడని చెప్పింది. సర్జికల్‌ బ్లేడ్‌లతో గాయపరచడంతో.. వారిని ఆస్పత్రికి తరలించారు. దాడి తర్వాత ధర్మతేజ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చేతులు కోసుకుని అపార్ట్‌మెంట్‌ పై నుంచి దూకాడని ఆమె తెలిపింది.

Also Read : Vijayawada : విజయవాడలో రౌడీ షీటర్ ఆత్మహత్య-ఫుట్‌బాల్ ప్లేయర్ హత్య