Group-1 Results : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు హైకోర్టు అనుమతి

తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై టీఎస్ పీఎస్ సీ అప్పీలుపై హైకోర్టులో విచారణ జరిగింది.

Group-1 Results : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు హైకోర్టు అనుమతి

Group-1

Group-1 Results : తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై టీఎస్ పీఎస్ సీ అప్పీలుపై హైకోర్టులో విచారణ జరిగింది. అభ్యర్థి స్థానికత వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్ పీఎస్ సీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతానికి గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు విడుదల చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. అభ్యర్థి స్థానికత వివాదం తర్వాత తేలుస్తామని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో 503 గ్రూప్ -1 పోస్టులకు అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఈ పోస్టులకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో  2,85,916 మంది అభ్యర్థులు ఎగ్జామ్ కు హాజరయ్యారు. అక్టోబర్ 29న ప్రాథమిక కీని విడుదల చేసి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను టీఎస్ పీఎస్ సీ స్వీకరించింది.

Group-2 Syllabus Changes : గ్రూప్-2 సిలబస్ లో మార్పులు.. పేపర్-2, 3లో కొత్త అంశాలు

అభ్యర్థుల నుంచి వ్యక్తమైన సందేహాలపై సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సులు పరిశీలించి, 5 ప్రశ్నలను తొలగించారు. అనంతరం నవంబర్ 15న తుది కీ ని ప్రకటించారు. మాస్టర్ ప్రశ్నాపత్రం ప్రకారం 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించింది. ఒక్కో ఉద్యోగానికి 50 మందిని మెయిన్స్ కు ఎంపిక చేయనున్నారు. మొత్తం 25, 150 మంది గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ కు అర్హత సాధిస్తారు.